Khammam Crime: ఇద్దరి ప్రాణం తీసిన పెద్ద మనుషులు.. అక్రమ సంబంధానికి రేటు కట్టి.. !

ఖమ్మంలో దారుణం జరిగింది. తుపాకులగూడెంలో భర్త కిరణ్‌ ఉండగానే స్వామి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అశ్విని వెళ్లిపోయింది. దీంతో కిరణ్ పరువునష్టం రూ.3 లక్షలు డిమాండ్ చేయగా పెద్దమనుషులు తీర్పు చెప్పారు. డబ్బుకట్టలేక ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారు.  

New Update
khammam

khammam Photograph: (khammam)

Khammam Crime: ఓ వివాహిత తన సుఖం కోసం చేసిన పని రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కట్టుకున్నవాడు ఉండగానే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోగా ఈ వ్యవహారం పంచాయితీ వరకు వెళ్లింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితోనే వెళ్తానని చెప్పిన మహిళకు ఆ గ్రామ పెద్దమనుషులు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. రూ.3 లక్షలు ఇచ్చి నచ్చినవాడితో వెళ్లాలని ఆదేశించారు. దీంతో అంత డబ్బు ఇచ్చే స్థోమత లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పెద్ద మనుషులు వినకపోగా మరింత ఒత్తిడి చేయడంతో ప్రేమికులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెంలో జరిగింది. 

పరువు తీసినందుకు నష్టపరిహారం..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుపాకుల గూడెంకు చెందిన ఆలం అశ్విని (23)కి అదే గ్రామానికి చెందిన ఆలం కిరణ్‌తో 5 క్రితం పెళ్లయింది. అశ్వినికి కిరణ్‌ బంధువు కాగా వరుసకు మరిది అవుతాడు. అయితే కొంతకాలం తర్వాత ఆలం స్వామి (25)తో అశ్విని అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటీవల స్వామితో కలిసి అశ్విని ఇంట్లోంచి వెళ్లిపోయి మరో దగ్గర కాపురం పెట్టారు. దీంతో కిరణ్‌ ఊర్లో పంచాయితీ పెట్టించి అశ్విని తనకు అవసరం లేదన్నాడు. కానీ తన పరువు తీసినందుకు రూ.3లక్షల నష్టపరిహారం కావాలని చెప్పాడు. 

ఇది కూడా చదవండి: Mega Vs Allu: రాంచరణ్ Vs అల్లు అర్జున్.. తొలిసారిగా భయటపడ్డ విభేదాలు.. ఇదిగో ప్రూఫ్!

ఈ క్రమంలోనే పెద్ద మనుషులు  పంచాయితీలో కిరణ్‌కు అశ్విని చెల్లించాల్సిందేనని తీర్మాణం చేశారు. దీంతో తమ దగ్గర అంత డబ్బు లేదని, తాము ఇవ్వలేమని ఆందోళన చెందారు. అయినా వినకుండా ఆదేశించడంతో మనస్తాపానికి గురైన స్వామి, అశ్విని ఇంట్లో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు గమనించిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: Kamal Haasan : ఫిక్స్ .. రాజ్యసభకు కమల్ హాసన్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment