HYD CRIME: హైదరాబాద్ లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిని 15 సార్లు పొడిచిన కొడుకు (వీడియో)

హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తి తగాదాలతో లాలాపేటకు చెందిన సాయి తన తండ్రి మోగిలిని పట్టపగలే రోడ్డుపై వెటాడి వేంటాడి 15 పోట్లు పొడిచాడు. బాధితుడిని శ్రీకర ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. సాయిని పోలీసులు అరెస్టు చేశారు. 

New Update
ecil murder

ecil murder Photograph: (ecil murder)

HYD CRIME: హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తి తగాదాలతో లాలాపేటకు చెందిన సాయి తన తండ్రి మోగిలిని పట్టపగలే రోడ్డుపై వెటాడి వేంటాడి 15 పోట్లు పొడిచాడు. బాధితుడిని శ్రీకర ఆస్పత్రికి తరలించగా అతను చనిపోయాడు. సాయిని పోలీసులు అరెస్టు చేశారు. 

 

వెనకాలే బైక్ పై ఫాలో అయిన కొడుకు..

అయితే లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి(45), అతని కొడుకు సాయి కుమార్ (25) ఇద్దరూ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌లో పనిచేస్తున్నారు. కొంతకాలంగా కుటుంబంలో కలహాలు, ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. అలాగే మొగిలి మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండగా సాయికుమార్‌ విసిగిపోయాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న సాయి.. లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా అతని వెనకాలే బైక్ పై ఫాలో అయ్యాడు. ECIL బస్‌ టెర్మినల్‌ వద్ద బస్సు దిగగానే తండ్రిని చాకుతో విచక్షణారహితగా పొడిచాడు. స్థానికులు దగ్గరలోని శ్రీకర ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Local Boy Nani: యూట్యూబర్‌ లోకల్‌బాయ్‌ నానికి బిగ్‌షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం!

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు. దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా నిందితుడు సాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Illegal Activities In SPA: యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచారం.. కండోమ్‌లతో నిండిన గదులు.. 23 మంది అరెస్టు!

ఇక తండ్రిని చంపిన సాయి ఎవరికో ఫోన్ చేసి గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు. వాడ్ని చంపేశాను. నేనే చంపేశాను. నా చేతులతో పొడిచి పొడిచి చంపేశాను అంటూ అరిచాడు. చుట్టుపక్కల చూస్తున్న జనంలో ఒకరి ఆ కుర్రాడ్ని ఎందుకిలా చేశాని అడగగా.. వాడు బతకడానికి వీల్లేదు. వాడు చావాల్సిందే. వాడు మా నాన్నే. నేను వాడికి కొడుకునే. అందుకే చంపేశానని అన్నాడు. కన్నకొడుకే తండ్రిని ఇంత క్రూరంగా, దారుణంగా చంపేస్తుంటే జనాలు షాక్ కు గురయ్యారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment