Bomb attack: భద్రాచలం ఆస్పత్రిపై బాంబు దాడి.. రోగులు, సిబ్బందితోపాటు!

తెలంగాణ భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. రోగులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అవి పెట్రోల్ బాంబులు కాదని, డోర్ కిందనుంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు. ఏ నష్టం జరగలేదు.

New Update
Petrol Bomb: గవర్నర్‌ అధికారిక నివాసంపై పెట్రోల్ బాంబులు.. ఇది ఎవరి పని?

Bhadrachalam Area Hospital attacked with petrol bombs

Bomb attack: తెలంగాణ ఖమ్మంలో మరో భయంకర సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. సూపరింటెండెంట్ ఛాంబర్‌పై పెట్రో బాంబులు విసరడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ  ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది ఏం జరిగిందో తెలియక ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో కొంత ఫర్నిచర్ కాలిపోగా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. 

కాలిబూడిదైన ఫర్నిచర్..

ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డట్లు తెలిపారు. అయితే వారు పెట్రోల్ బాంబులు విసరలేదన్నారు. తన ఛాంబర్ గది తలుపు కింద నుంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు చెప్పారు. కొంత ఫర్నిచర్ కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రి రోగులకు ఎలాంటి హానీ జరగలేదన్నారు. ఎలాంటి నష్టం కూడా వాటిల్లలేదని చెప్పారు. 

Also read :  దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!

'పెట్రోల్ బాంబుతో దాడి జరిగిందనేది అవాస్తవం. తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు. నా ఆఫీస్ రూమ్ లక్ష్యంగా చేసుకుని నిప్పంటించారా? లేక మతిస్థిమితం లేని వ్యక్తులు ఇలా చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం' అని రామకృష్ణ తెలిపారు. 

Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు.ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. బైక్ అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. దీంతో ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ వాహనాదారుడు మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు