Rape case: నలుగురు బిడ్డల తల్లిపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ పార్ట్స్ కొరికి, గోళ్లతో రక్కి!

బెంగళూర్‌లో దారుణం జరిగింది. నగరం నడి బొడ్డున నలుగురు పిల్లల తల్లిపై సమూహిక అత్యాచారం కలకలం రేపింది. క్యాటరింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తామని నమ్మించి నలుగురు యువకులు ఆమెను రూమ్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
crime

Bangalore married woman sexually assault case Four members arrest

Rape case: బెంగళూర్‌లో దారుణం జరిగింది. నగరం నడి బొడ్డున నలుగురు పిల్లల తల్లిపై సమూహిక అత్యాచారం కలకలం రేపింది. పొట్టకూటికోసం ఇళ్లు వదిలి వచ్చి కుంటుంబాన్ని పోషించుకుంటున్న వివాహితను దుర్మార్గులు నమ్మించి మోసం చేశారు. పని ఇప్పిస్తామని పిలిచి క్రూరమృగాళ్లలాగా ఆమెపై కాంమవాంఛ తీర్చుకున్నారు. తనకు భర్త, పిల్లులున్నారని, ఇలా చేయొద్దని ఆమె వేడుకున్న కనికరించకుండా లైంగిక దాడి చేశారు. 

హిందీలో మాట కలిపి.. 

ఈ మేరకు  డీసీపీ సారా ఫాతిమా తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఆ వివాహిత తన భర్తతో కలిసి బెంగళూరుకు వచ్చి క్యాటరింగ్‌ పనులు చేసుకుంటోంది.  అయితే గురువారం రాత్రి విధులు ముగించుకుని జ్యోతినివాస్‌ కళాశాల వద్ద ఫ్రెండ్ ను కలిసేందుకు వెళ్లింది. అక్కడే ఆమెకోసం రోడ్డుపై వేచి చూస్తున్న క్రమంలో సమీపంలోని హోటల్‌లో పని చేస్తున్న నలుగురు యువకులు ఆమె దగ్గరకు వచ్చి హిందీలో మాట కలిపారు. తాము హోటల్‌లోనే పని చేస్తున్నామంటూ కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఆమెను భోజనానికి ఆహ్వానించారు. హోటల్‌ టెర్రస్‌పైకి తీసుకెళ్లి భోజనం పెట్టించి క్యాటరింగ్‌ ఆర్డర్స్ ఉంటే చెబుతామని నమ్మించారు. 

ఇది కూడా చదవండి: TS: మోకాళ్ల లోతు మట్టి, బురద..కష్టతరం అవుతున్న కార్మికుల రెస్క్యూ

ప్రైవేట్ పార్ట్స్ కొరికి..

ఆ తర్వాత ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి తమ రూమ్ కు తీసుకువెళ్లి లైంగిక దాడి చేశారు. నలుగురు బిడ్డల తల్లినని చెబుతున్నా వినలేదు. బాధితురాలి ముఖంతోపాటు ప్రైవేట్ పార్ట్స్ కొరికారు. గోళ్లతో రక్కి హింసించారని పోలీసులు తెలిపారు. ఇక నలుగురు నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అజిత్, విశ్వ, శిభుల్, ఉత్తరాఖండ్‌కు చెందిన శోభన్‌ గా గుర్తించి అరెస్టు చేసినట్లు సారా ఫాతిమా తెలిపారు. 

ఇది కూడా చదవండి: Champions Trophy: ఈరోజు మ్యాచ్ లో కోహ్లీ, పంత్ ఆడతారా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment