Producer SKN Controversy: ‘బేబీ’ని టార్గెట్ చేసిన నిర్మాత ఎస్‌‌కేఎన్.. ఇద్దరి మధ్య జరిగింది ఇదే!

నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నటి వైష్ణవి చైతన్యను ఉద్దేశించే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘బేబీ’ హిట్ తర్వాత అతడి సినిమాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని.. అందుకే ఆమెపై కోపంతో నిర్మాత ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు ఫైరవుతున్నారు.

New Update
Producer SKN controversial comments on Baby movie heroine Vaishnavi Chaitanya

Producer SKN controversial comments on Baby movie heroine Vaishnavi Chaitanya

ప్రొడ్యూసర్ SKN వివాదాల్లో చిక్కుకున్నారు. తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగులో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలిసి వచ్చిందని అన్నారు. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయనంటూ అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నిర్మాత ఎస్‌కేఎన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు! 

ఆ హీరోయిన్‌పై కోపం

తెలుగు ఇండస్ట్రీ (Telugu Film Industry) లో సినిమాలు తీస్తున్న మీరు.. సొంత భాష అమ్మాయిలను తీసుకోబోమని చెప్పడం సరైన పద్దతి కాదని మండిపడుతున్నారు. అయితే నిర్మాత ఎస్‌కేఎన్ తెలుగు హీరోయిన్, ‘బేబీ’ మూవీ నటి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడని నెటజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ‘బేబీ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వైష్ణవి క్రేజ్ బాగా పెరిగిపోయింది. 

తనను కాదని

దీంతో తమ సినిమాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని.. అందుకే ఆమెపై నిర్మాత కోపంగా ఉన్నాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక సినిమా వేదికపై ఆలోచించి మాట్లాడాలని.. తెలుగులో సినిమాలు చేస్తూ.. తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేయబోమని మాట్లాడితే ఎలా అని ఫైర్ అవుతున్నారు. అది మాత్రమే కాకుండా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ హీరోయిన్ కాయద్‌పై చేసిన వ్యాఖ్యలపై కూడా కొందరు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అదే వేదికపై ఆమె పేరుతో కాయలు, పండ్లు అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది. 

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

ఎస్‌కేఎన్ ఏమన్నాడంటే?

‘‘తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే.. తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలిసింది. అందువల్ల నేను.. మా దర్శకుడు సాయి రాజేశ్ తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

Also Read :  Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment