NTR-Sukumar : ఫిక్స్.. ఎన్టీఆర్తో సుకుమార్..  మరి దేవర 2 ఎప్పుడు?

ఎన్టీఆర్, సుకుమార్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తారక్ కి ప్రేమతో అని ఆమె క్యాప్షన్ ఇవ్వగా.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్" అనే ఎన్టీఆర్ రిపోస్ట్ చేశారు.

New Update
ntr-sukumar

ntr-sukumar

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలోవచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలో మరో మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.  అలాంటి ఫ్యాన్స్ కు వీరిద్దరూ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా వీరిద్దరూ కలిసి హగ్ చేసుకున్న ఫోటోను  సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.  తారక్ కి ప్రేమతో అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది. 

Also read : రిటైర్మెంట్ వార్తలపై ధోనీ బిగ్ అనౌన్స్మెంట్!

Also Read : SRH VS GT : సన్‌రైజర్స్ కు బిగ్ షాక్ ..  మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు

నన్ను వెంటాడే ఎమోషన్ సుకుమార్

ఆమె పోస్టును రిపోస్ట్ చేసిన ఎన్టీఆర్ నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్" అనే క్యాప్షన్‌ ఇచ్చారు.  ఇద్దరి మధ్య కథ చర్చలు నడిచాయని సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ..  ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్‌లో నటిస్తున్నాడు. ఇది అయిపోయాక దేవర2 చేయబోతున్నాడు. అనంతరం సుకుమార్ తో సినిమా చేయనున్నాడు. 

పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాగా పుష్ప 2: ది రూల్ లాంటి హిట్ తరువాత సుకుమార్ తన కొత్త సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుందని సమాచారం. 

Also Read :  కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ బిగ్ షాక్!

Also Read :  అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

 

jr-ntr | Tollywood news updates | tollywood-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment