Amitabh Bachchan: బిగ్ బీకి కలిసొచ్చిన రియల్‌ఎస్టేట్.. రూ.83 కోట్లకు అపార్ట్‌మెంట్

అమితాబ్ బచ్చన్‌కు రియల్ఎస్టేట్‌లో కాసుల పంట పడింది. ముంబైలోని అపార్ట్‌మెంట్‌ అమ్మితే 168 శాతం లాభం. 2021లో రూ.31 కోట్లకు కొన్న అపార్ట్‌మెంట్‌ను జనవరి 17న రూ.83 కోట్లకు అమ్మాడు. ఇన్నిరోజులు దీన్ని నటి కృతి సనన్‌కు నెలకు రూ.10 లక్షల రెంట్‌కు ఇచ్చారు.

New Update
amithab bachan

amithab bachan Photograph: (amithab bachan)

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు రియల్ఎస్టేట్‌లో కాసుల పంట పడింది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌ను అమ్మితే 168 శాతం లాభం వచ్చింది. అంధేరీ ప్రాంతంలో అట్లాంటిస్ బిల్డింగ్‌లో ఉన్న 5వేల చదరపు అడుగుల డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ అమితాబ్ బచ్చన్ రూ.83 కోట్లకు అమ్మాడు. జనవరి 17న దీనికి సంభందించి అధికారికంగా రిజిస్ట్రేషన్ అయ్యింది. ముంబైలోని అంధేరీలోని అట్లాంటిస్ భవనంలోని 27, 28 అంతస్తుల్లో ఆ డూప్లెక్స్ ఫ్లాట్ ఉంది. అపార్ట్‌మెంట్ సేల్‌లో స్టాంప్ డ్యూటీనే రూ.4.98 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000 చెల్లించాడు బిగ్ బీ. 

Also Read: Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !

ఈ అపార్ట్‌మెంట్‌ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్‌లు కొన్నారు. అమితాబ్ బచ్చన్ దీన్ని 2021 ఏప్రిల్‌లో రూ.31 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది ఇప్పుడు రూ. 83 కోట్లకు విక్రయించబడింది. దీని విలువ దాదాపు 168 శాతం పెరిగింది. 2021 నవంబర్ నుంచి అమితాబ్ బచ్చన్ ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను నటి కృతి సనన్‌కు నెలకు రూ.10 లక్షలకు రెంట్‌కు ఇచ్చారు. 2025 జనవరి 17 అపార్ట్‌మెంట్ అమ్మేశారు. 2020 నుంచి 2024 వరకు బచ్చన్ ఫామిలీకి రియల్ ఎస్టేట్‌లో బాగా లాభాలు వచ్చాయి. దాదాపు రూ.200 కోట్ల వరకు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీటిలో చాలా వరకు ముంబై సిటీతోపాటు చుట్టు పక్కల ఉన్నాయి.

Also Read: Dil Raju: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Hema: కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ బిగ్ షాక్!

నటి హేమ.. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రితో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్ కి లీగల్ నోటీసులు పంపింది. గతంలో వీరిద్దరూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.

New Update
hema sent legal notices to kalyani Tamanna simhadri

hema sent legal notices to kalyani Tamanna simhadri

Actress Hema:  టాలీవుడ్ నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో తనపై అవాస్తవాలు ప్రచారం చేసిన పలు యూట్యూబ్ ఛానెల్స్ కు, పలువురు నటులకు లీగల్ నోటీసులు పంపింది. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొంది. అంతేకాదు తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది హేమ. మా ఎన్నికల సమయంలోనూ హేమ.. కళ్యాణి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటికే తమన్నా.. హేమ లీగల్ టీమ్ తో చర్యలు జరుపుతున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

 2023లో కూడా

అయితే  2023లో కూడా హేమ పలు యూట్యూబ్ ఛానెళ్ల పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బర్త్ డే పార్టీలో భర్తతో కలిసి ఉన్న ఫొటోలకు ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయింది. ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఇదిలా ఉంటే గతేడాది హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన హేమ.. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆమెను మా అసోసియేషన్ నుంచి తొలగించడం కూడా జరిగింది. కాగా, ఆ తర్వాత నిర్వహించిన రక్త పరీక్షల్లో నెగిటివ్ అని తేలడంతో 'మా' హేమ పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. 

 telugu-news | latest-news | actress-hema | karate-kalyani | tamanna-simhadri | cinema-news

ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

Advertisment
Advertisment