Trump Effect: పెద్దన్న నిర్ణయానికి ..ఏపీలో ఆక్వారంగం కుదేలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీలోని ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రొయ్యలపై దిగుమతి సుంకాన్ని అమెరికా పెంచబోతోందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఏపీలో రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోయాయి.

New Update
aqua

aqua

అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందనేది ఓ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచ దేశాలలో పెద్దన్నలాంటి అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఇతర దేశాలపై ప్రభావం చూపనుంది. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు అయితే.. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపిస్తాయని సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. పాలనాపరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల ప్రభావం ప్రపంచ దేశాల మొత్తం మీద పడుతోంది. ఈ పరిణామాలను అందరూ గమనిస్తూనే ఉన్నారు. 

Also Read: malla reddy college: క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్ మృతి.. వీడియో వైరల్

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏపీలోని ఆక్వారైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదేంటీ.. ఏపీలోని రైతులకు, అమెరికా అధ్యక్షుడికి సంబంధం ఏమిటనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు సంగతి..ఏపీలోని ఆక్వా రంగంపై  ట్రంప్‌ రూపంలో పిడుగు పడింది. రొయ్యలపై దిగుమతి సుంకాన్ని పెంచే ఆలోచనలో అమెరికా ఉన్నట్లు వార్తలు రావటంతో ఏపీలో రొయ్యల కొనుగోళ్లు ఆగిపోయాయి. రొయ్యలపై ప్రస్తుతం 3 నుంచి 4 శాతంగా ఉన్న సుంకాన్ని .. అమెరికా 26 శాతానికి పెంచినట్లు వార్తలు రావటంతో ఏపీలో చాలా చోట్ల రొయ్యల కొనుగోళ్లు పూర్తిగా స్తంభించిపోయాయి.

Also Read: Uttam Kumar Reddy: సన్నబియ్యం పంపిణీలో తేడా జరిగితే.. ఉత్తమ్ హెచ్చరిక

కొత్త సుంకాలను అమెరికా అమలులోకి తీసుకుని వస్తే... అమెరికాకు ఇక్కడి నుంచి రొయ్యలను ఎగుమతి చేయాలంటే భారీగా పన్నులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఎగుమతి చేయాలంటే రూ.26వేలు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుది. దీనికి అదనంగా రవాణా, ప్యాకింగ్‌ ఖర్చులు కూడా ఉంటాయి.అమెరికాలో రొయ్యలపై సుంకాన్ని పెంచారనే వార్తలతో రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రొయ్యల ధరలు తగ్గుతూ.. ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు 100 కౌంట్‌ ధర రూ.230 వరకు ఉండగా.. ప్రస్తుతం ఈ ధర రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గిపోయింది.

దీంతో రొయ్యలను సాగుచేస్తున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఓ పక్క వ్యాధులు, మరోపక్క పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి అమెరికా నిర్ణయం కోలుకులేని దెబ్బే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే రొయ్యలు వంటి ఆక్వా ఉత్పత్తులు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. తాజా నిర్ణయంతో ఆ జిల్లాలోని ఆక్వారైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Also Read:  TS: ఉత్తమ విద్యావస్థ కోసం కొత్త పాలసీ..సీఎం రేవంత్ రెడ్డి

Also Read: IPL 2025: ఐపీఎల్‌లో అతనుంటే చాలు.. ఏ ఆర్డర్‌లో వస్తే ఏంటి? గేల్ కామెంట్స్ వైరల్!

 america | trump | trump tariffs | trump tariffs india | trump tariffs news | trump tariffs on india | donald trump tariffs | latest-news | ap telugu news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment