Ap: ఐర్లాండ్‌లో ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి

ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్‌ , పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్‌ గా అధికారులు గుర్తించారు.

New Update
Road accident kadapa

Road Accident

ఐర్లాండ్‌ లో ఏపీకి చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. చనిపోయిన వారిని జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్‌ (24), పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్‌ (25)లుగా అధికారులు గుర్తించారు. 

Also Read: Horoscope Today: ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా..ఉత్సాహంగా గడుపుతారు..!

జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి సాయిబాబా జగ్గయ్యపేటలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడ ప్యూరిఫైడ్‌ వాటర్‌ పరికరాల బిజినెస్ చేస్తుంటారు. సాయిబాబా పెద్ద కుమారుడు భార్గవ్ మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లాడు. కార్లోలోని సౌత్‌ఈస్ట్ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. భార్గవ్ అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నారు. చెరుకూరి రామకోటయ్య, కుమారి దంపతులకు పెద్ద కుమారుడు సురేష్‌ ఎమ్మెస్‌ చేసేందుకు ఏడాది క్రితం ఐర్లాండ్ వెళ్లాడు.

Also Read: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

భారీగా మంచు కురవడంతో...

ఈ క్రమంలో చిట్టూరి భార్గవ్, చెరుకూరి సురేష్‌లు మరో ఇద్దరితో కలిసి కారులో ట్రిప్‌కు వెళ్తుండగా రాతో అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భారీగా మంచు కురవడంతో కారు చెట్టును ఢీకొట్టడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. ఈ ఘటనలో భార్గవ్, సురేష్‌లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. ఉన్నత చదువు కోసం వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ రోడ్డు ప్రమాదంపై భార్గవ్ తండ్రి సాయిబాబాకు అక్కడ యూనివర్సిటీ నుంచి సమాచారం వచ్చింది. భారీగా మంచు కురవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.సాయిబాబా కుమారుడ్ని ఉన్నత విద్య చదివించాలని ఐర్లాండ్‌ పంపించారు. భార్గవ్ చదువు కొద్ది నెలల్లో పూర్తికానుండటంతో.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే భార్గవ్ కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న సమయంలో ఇలా జరుగుతుందని ఊహించలేదు అంటున్నారు. 

ఈ ప్రమాదం గురించి తెలియగానే భార్గవ్‌ బంధువులు టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెట్టెం రఘురాంను కలిశారు. ఐర్లాండ్‌ నుంచి భార్గవ్ భౌతికకాయాన్ని తెప్పించాలని కోరగా.. నెట్టెం రఘురాం వెంటనే స్పందించి మంత్రి నారా లోకేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు వెంటనే స్పందించి ఐర్లాండ్‌లో భారత రాయబారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఐర్లాండ్‌లో పూర్తి చేయాల్సిన లాంఛనాలు త్వరగా పూర్తిచేసి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Also Read: Chennai Crime: ఏసీ ఆన్‌ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్‌ మిస్టరీ!

Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన సీఎల్పీ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment