Ap-Tg Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త...ఠారెత్తిస్తున్న ఎండలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. కోస్తాలో వేడిగాలులు సెగలు పుట్టిస్తున్నాయి.ప్రకాశం జిల్లా ,కడప,నంద్యాల,తిరుపతి, శ్రీకాకుళం వరకు మొత్తం 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

New Update
Telangana: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

Ap-Tg Weather Updates

ఏపీలో భానుడు భగభగమంటున్నాడు. ఈ క్రమంలోనే రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.విపరీతంగా వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం శ్రీకాకుళం జిల్లా -6, పార్వతీపురం మన్యం -12, అల్లూరి సీతారామరాజు-3, విజయనగరం-9, కాకినాడ-3, తూర్పుగోదావరి-2 మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది' అన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నేడు 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి' అన్నారు ఎండీ రోణంకి కూర్మనాథ్.

Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

శుక్రవారం 15 మండలాల్లో తీవ్రవడగాలులు, 90 మండలాల్లో వడగాలుల వీచాయన్నారు. శుక్రవారం 181 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆలమూరులో 42.5, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.1, అన్నమయ్య జిల్లాలో 42 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.

Also Read:  Ap:ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు..

Ap-Tg Weather Updates

మరోవైపు రాష్ట్రంలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. టెక్నాలజీ ఉపయోగించి ప్రజల మొబైల్స్‌కు అలర్ట్ మెసేజ్ పంపుతోంది. ఆ జిల్లాల్లో ప్రజలు మెసేజ్‌ను చూసి ఓకే బటన్‌ నొక్కే వరకూ ఫోన్‌ మోగేలా ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ. సూచించింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెసేజ్‌లో సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, గ్లూకోజ్‌, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్‌ఎస్‌ వంటివి తాగాలనే ఆ మెసేజ్‌లో సూచిస్తున్నారు.

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మాడు పగిలే ఎండలతో ప్రజలు ఠారేత్తిపోతున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 నుంచే భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళల్లో అయితే భగభగ మండే ఎండలతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు ఉదయం 11 గంటల సమయంలోనే నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్ర ఎండలు, ఊపిరాడకుండా చేసే ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 

రాత్రి వేళల్లో గాలిలో తేమశాతం తగ్గిపోవటంతో ఉక్కపోత వంటి వాతావరణం ఉంటుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం (మార్చి 28) రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ గ్రామంలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు చెప్పారు. 

నేటి నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. కుమురంభీం-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ-గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు ఆదివారానికి  ఆరెంజ్‌ రంగు హెచ్చరికను జారీ చేసింది.

Also Read: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

Also Read: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

 

weather | Andhra Pradesh and Telangana Weather Report | andhra pradesh weather | AP Weather Alert | ap-weather | ap today weather update | kurnool | tirupati | prakasam | hyderabad | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment