Obesity: మహిళల్లో ఊబకాయం ఎందుకు పెరుగుతుంది?

సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, భౌగోళిక అంశాలు మహిళల్లో ఊబకాయం పెరుగడానికి ప్రధాన కారణం. ఊబకాయం సమస్యతో బాధపడుతున్న మహిళలు పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తినండి.

New Update
Obesity: మహిళల్లో ఊబకాయం ఎందుకు పెరుగుతుంది?

Obesity: ప్రస్తుతం జీవనశైలిలో ఊబకాయం, బరువు పెరగడం ప్రమాద ఘంటికలుగా మారాయి. పురుషులు, మహిళలు ఇద్దరూ బరువు పెరగడంతో బాధపడుతున్నప్పటికీ ఎక్కువ మంది బాధితులు మహిళలే. ఒకటి కాదు.. అనేక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, భౌగోళిక అంశాలు దీనికి కారణమవుతాయి. భౌగోళిక కారకాలు అతిపెద్ద కారకం కావచ్చు. అనేక మధ్య ఆసియా దేశాలలో, మహిళలు తమ జీవితంలో ఎక్కువ భాగం ఇంట్లోనే గడుపుతారు. ఇది వారి శారీరక శ్రమను తగ్గిస్తుంది. వారి జీవన నాణ్యత క్షీణించడం ప్రారంభిస్తుంది. సాంప్రదాయకంగా ఇంటి పనుల బాధ్యతను మహిళలకు అప్పగిస్తారు. ఇది వారిలో ఊబకాయానికి దారితీస్తుంది.

శారీరక కారకాలు:

స్త్రీ, పురుషుల మధ్య శారీరక వ్యత్యాసం చాలా ఉంటుంది. అందుకే పురుషుల కంటే మహిళల శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది పునరుత్పత్తి పనితీరుకు సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో బరువు పెరగడం. వీటితో పాటు హైపోథైరాయిడిజం, పీసీఓడీ, పీసీఓఎస్ లాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా బరువును పెంచుతాయి. పురుషులలో లేని అదనపు ప్రొజెస్టెరాన్, మహిళల్లో బరువు పెరగడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది.

వృత్తిపరమైన అంశాలు కూడా స్థూలకాయానికి దోహదం చేస్తాయి. సామాజిక వ్యవస్థను గమనిస్తే పురుషులు శారీరక శ్రమలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. ఉదాహరణకు, ఎక్కువ గంటలు పనిచేయడం, బరువులు ఎత్తడం, పొలాల్లో పనిచేయడం చేస్తుంటారు. మరోవైపు మహిళలు తక్కువ శారీరక శ్రమతో డెస్క్ ఉద్యోగాలలో పనిచేయడానికి ఇష్టపడతారు. గట్టి ఆర్థిక నేపథ్యం ఉన్న మహిళలు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంటుంది. వారికి అన్ని సౌకర్యాలూ కాళ్ల దగ్గరే ఉంటాయి. ఇది వారి శారీరక శ్రమను తగ్గిస్తుంది. అదే సమయంలో ఇంట్లో ఇలాంటి పరిస్థితులు లేనివారు ఎక్కువగా శారరీక శ్రమ చేస్తుంటారు.

నివారించడం ఎలా?:

పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్ , తృణధాన్యాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తినండి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఆహార పరిమాణాన్ని నియంత్రించడానికి.. 3 పెద్ద భోజనాన్ని 6 చిన్న భోజనంగా విభజించండి. అలాగే మీ ప్లేట్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదన్న దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

ఇది కూడా చదవండి: మానసిక ఆరోగ్యం, రుతుస్రావం మధ్య సంబంధం ఏంటి?

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

New Update
AP Cabinet Meeting

AP Cabinet Meeting

AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

 

Advertisment
Advertisment
Advertisment