🔴LIVE NEWS: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇంట్లో విషాదం.. తల్లి కమలహాసిని మృతి!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
బెంగళూరు నగరంలో ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో దాదాపు 40 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, వంటి ప్రాంతాలు నీట మునిగాయి.
నైరుతీ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రానున్నాయి. ఈ క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో నెల్లూరు, ఒంగోలు, తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకావం ఉందని వెల్లడించింది.
కరెంట్ షాక్తో పులి మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో తిరుగుతున్న (K-8) ఆడపులి స్మగ్లర్లు అమర్చిన కరెంట్ తీగలకు బలైంది. 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇది తుపానుగా మారనుంది. నేటి నుంచి ఒక వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఏపీలో మన్యం, ఏలూరు, కర్నూలులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మొత్తం 12 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఈసారి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి త్వరగానే రానున్నట్లు వెల్లడించింది.
ఏపీ, తెలంణాలో గాలులు, పిడుగులతో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కూడా కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో తిరుపతి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.