Crime: అయోధ్య సాక్షిగా.. కామవాంఛ తీర్చుకుని మహిళను కాటికి పంపిన దుర్మార్గులు!

యూపీలో మరో దారుణం జరిగింది. అయోధ్యకు చెందిన ఓ మహిళపై మలీహాబాద్‌లో సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న ఆమెను కిడ్నాప్‌ చేసిన ఆటో డ్రైవర్, మరికొంతమంది కామవాంఛ తీర్చుకుని గొంతు నులిమి చంపేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Update
bihar

Uttar Pradesh ayodhya Woman gang raped

UP Crime: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. మలీహాబాద్‌లో ఓ మహిళ (32)పై సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న ఆమెను కిడ్నాప్‌ చేసి కామవాంఛ తీర్చుకున్న దుర్మార్గులు కోరిన తీరిన తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశారు. ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపగా వివరాలు ఇలా ఉన్నాయి.

ఆలంబాగ్‌లో ఆటో ఎక్కగానే..

ఈ మేరకు అయోధ్యలో ఉంటున్న ఓ మహిళ వారణాసిలో ఓ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరైంది. అనంతరం  బుధవారం తెల్లవారుజామున మలీహాబాద్‌లోని తన సోదరుడి ఇంటికి వెళుతుండగా.. మార్గమధ్యంలో ఆమె ఆలంబాగ్‌లో ఆటో ఎక్కింది. దీంతో ఆటో డ్రైవరు దారి మళ్లించి మలీహాబాదుకు తీసుకువెళ్లాడు. అయితే ఎంతసేపటికి ఆమె ఇంటికి రాకపోవడంతో సోదరుడికి అనుమానం వచ్చింది. లైవ్‌ లొకేషను షేర్‌ చేసిన ఇంటికి రాకపోవడంతో  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా మలీహాబాద్‌ సమీపంలోని మామిడితోటలో ఆమె అపస్మారక స్థితిలో కనిపించినట్లు డీసీపీ కమలేశ్‌ కుమార్‌ దీక్షిత్‌ తెలిపారు.

Also read :  నా కూతురిపై గ్యాంగ్ రేప్ .. ఆదిత్య ఠాక్రే కారణమంటూ హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్

వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీకి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నామని, వీలైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. 

Also read :  కర్నూల్‌లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే!
 
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగ్న వీడియోలను ఉపయోగించి విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేశాడని, అలాగే లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి.  హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కళాశాల చీఫ్ ప్రొక్టర్ రజనీష్ కుమార్ పై ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుండి పరారీలో ఉన్నాడు, విద్యార్థులపై లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియోలు పోలీసులకు చేరాయి.

 uttara-pradesh | rape | women | today telugu news | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh : టచ్ చేస్తే చచ్చిపోతా.. ఫస్ట్ నైట్ రోజే వరుడికి వధువు షాక్.. చివరికి బిగ్ ట్విస్ట్!

ఉత్తరప్రదేశ్‌లో ఓ వరుడికి మొదటి రాత్రే వధువు షాక్ ఇచ్చింది. శోభనం రాత్రి నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని వరుడికి బెదిరించింది. ఎంత నచ్చజెప్పినా కూడా వధువు వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

author-image
By Kusuma
New Update
Marriage

Uttar pradesh

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి జరిగి కనీసం ఒక రోజు కాకుండానే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంతో పవిత్రమైన పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి యువతితో పెళ్లి జరిగింది.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పెళ్లికి ముందే ఓ అబ్బాయిని..

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో మొదటి రాత్రే వధువు చేసిన పనికి వరుడు గజ గజ వణికి పోయాడు. శోభనం గదిలో వధువు వరుడికి ఓ వింత కండిషన్ పెట్టింది. నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించింది. వరుడు ఎంత నచ్చజెప్పిన కూడా వధువు వినిపించు కోలేదు. టచ్ చేయవద్దని బెదిరించింది. 

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

చివరకు వరుడు అడగ్గా.. పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని ఇప్పటికీ కూడా అతన్నే ప్రేమిస్తున్నానని, తనే నా భర్త అని తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఆ వధువు ఏ మాత్రం కూడా వినకపోయే సరికి వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

 

marriage | uttar-pradesh | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment