AP Crime: ఏపీలో దారుణ హత్య.. మహిళను రేప్ చేసి, మెడ కోసిన దుర్మార్గులు!

ఏపీలో మరో దారుణ హత్య జరిగింది. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో గుర్తు తెలియని మహిళను రేప్ చేసి, గొంతుకోసి చంపేశారు. మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్స్, సెల్ ఫోన్ దొరికినట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

New Update
ap crime

AP Crime: ఏపీలో మరో దారుణ హత్య జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలో మహిళను అత్యంత కిరాతకంగా చంపేశారు. జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుంటూరు ఛానల్ పక్కన దాదాపు 30 ఏళ్ల మహిళను రేప్ చేసి, గొంతుకోసి హతమార్చారు. ముళ్ళ పొదల్లో మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. 

మెడపై కత్తితో పొడిచి..

ఈ మేరకు కొలనుకొండ సమీపంలోని స్థానికులు గుర్తుతెలియని మహిళ హత్యకు గురైందని సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి పరిశీలించగా మహిళను అత్యాచారం చేసి దారుణంగా మెడపై కత్తితో పొడిచి చంపేసినట్లు ఆనవాళ్లు లభించాయి. మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్స్, తదితర వస్తువులు దొరికాయి. ఆమె సెల్ ఫోన్ కూడా గుర్తించాం. దాని ఆధారంగా వివరాలు సేకరిస్తాం. ప్రస్తుతం ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అనేది వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. 

Also Read: లారెన్స్ మామూలోడు కాదుగా.. ఈ సారి ఏ దెయ్యానికి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?

ఇదిలా ఉంటే.. కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన స్థానికులు సదరు వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు శనివారం స్థానిక దర్గా సెంటర్‌లో బంగారు ఆభరణాలు తయారీ షాపు నిర్వహిస్తున్న యజమాని కామేశ్వరరావు ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామేశ్వరరావు. చిన్నారులకు చాకెట్లు, డబ్బుల ఆశచూపి రేప్‌ కామేశ్వరరావు రేప్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

 married women murder | guntur | rape | latest-telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gang rape: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!

బీహార్‌లో దారుణం జరిగింది. భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఊరికి వెళ్లి వస్తున్న దంపతులపై దాడి చేసి 50వేల నగదు, బంగారు నగలు దోచుకున్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా పరారిలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.   

New Update
 Gang rape

Bihar boys gang-raped on Women

Gang rape: బీహార్‌లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నలందలోని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఊరికి వెళ్తున్న దంపతులను రోడ్డుపై ఆపిన దుండగులు దాడి చేసి గాయపరిచడం  కలకలం రేపింది. పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా మరికొంతమంది పరారిలో ఉన్నారు. ఈ అవమానవీయమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా..

బీహార్‌ నలందలోని ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన దంపతులు ఆదివారం రాత్రి తమ బంధువుల ఇంటికి వెళ్లి  బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఆ సమయంలోనే మార్గమధ్యలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని చుట్టుముట్టారు. మొదట భర్తను కొట్టి గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యను కొట్టారు. వారిదగ్గరున్న 50 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరకుని నిందితుల్లో ఒకరిని పట్టుకున్నట్లు డిఎస్పీ గోపాల్ కృష్ణ, ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ చీఫ్ అనిల్ కుమార్ పాండే తెలిపారు. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఇక బాధిత దంపతులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి.. అత్యాచారం, దోపిడీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన శోభా బిఘా గ్రామ నివాసి కౌశలేంద్ర కుమార్ అలియాస్ సన్నీని అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న రెండవ నిందితుడికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

bihar | gangrape | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment