V C Sajjanar: నెక్స్ట్ హర్షసాయి.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్!

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారి భరతం పడుతున్నారు వి.సి సజ్జనార్. తాజాగా యూట్యూబర్ హర్షసాయిని టార్గెట్ చేశారు. అతడి వీడియో షేర్ చేసి వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘసేవ చేస్తున్నట్టు.. బిల్డప్ ఇస్తున్నాడని హర్షసాయిపై మండిపడ్డారు.

New Update
VC Sajjanar serious warning to YouTuber Harsha Sai after sharing video

VC Sajjanar serious warning to YouTuber Harsha Sai after sharing video

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారి భరతం పడుతున్నారు మాజీ ఐపీఎస్, ప్రస్తుత టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీ.సీ సజ్జనార్. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి.. గేమింగ్ యాప్‌లను ఇప్పటి వరకు ఎవరెవరు ప్రమోట్ చేశారో వారికి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.

ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ఇప్పటికే వైజాగ్ యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బండాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అలాగే తాజాగా బయ్యా సన్నీ యాదవ్‌ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఆయన రియాక్ట్ అవ్వడంతో సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా.. వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. 

ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

నెక్స్ట్ టార్గెట్ హర్షసాయి

ఈ క్రమంలో వీ.సీ సజ్జనార్ మరో పాపులర్ యూట్యూబర్ హర్షసాయిని టార్గెట్ చేశారు. అతడికి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసి వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘసేవ చేస్తున్నట్టు.. బిల్డప్ ఇస్తున్నాడని హర్షసాయిపై మండిపడ్డారు. ఈ మేరకు ఫాలోవర్స్ అందరూ హర్షసాయి లాంటి వారిని అన్‌ఫాలో చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. 

‘‘చేస్తున్న‌దే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు! ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు.

ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగ‌నం డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి.’’ అని ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

కాగా సజ్జనార్ దెబ్బకు ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు అయింది. ఇక సజ్జనార్ లిస్టులో సురేఖవాణి కూతురు సుప్రియ, వినయ్ కుయ్యా, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, డేర్ స్టార్ గోపాల్, విజ్జు గౌడ్, శ్రీధర్ చాప వంటి యూట్యూబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ యూట్యూబర్లు వరుసగా అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Warangal: వరంగల్ లో బయటపడ్డ దారుణం.. డబ్బుల కోసం లవర్ తో కలిసి.. మైనర్లకు గంజాయి ఇచ్చి వ్యభిచారం..!

వరంగల్ లో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. కీలక నిందితురాలు ముస్కు లతను అరెస్ట్ చేసిన పోలీసులు.

New Update
Atrocities uncovered

Atrocities uncovered

వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపి (Prostitution) లోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కు లతను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ (Instagram Account) సహాయంతో ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసిన యువతి తన లవర్ తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు చేసింది.  అంతే కాకుండా మైనర్ బాలికను నర్సంపేట తీసుకెళ్ళి  గంజాయి తాగించి అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. మార్చి 11న జరిగిన ఈ పాశవిక ఘటనను సీరియస్ గా తీసుకున్న వరంగల్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మార్చి 11వ తేదీ వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కి సంబంధించి ఫిర్యాదు రాగా..  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

Also Read :  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండండి!

Atrocities Uncovered In Warangal

దర్యాప్తు చేసిన పోలీసులు కిడ్నాప్ కు గురైన మైనర్ బాలిక (Minor Girl) ని ములుగు క్రాస్ దగ్గర గుర్తించారు.తదుపరి బాలికని విచారించగా తనను కొంతమంది కిడ్నాప్ చేసి గంజాయి తాగించి ఆపైన అత్యాచారం చేసారని తెలిపింది. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందుతుల కోసం గాలించారు.ఈ క్రమంలో దామెర మండలానికి  చెందిన పడుపు వృత్తి చేసే మస్కు లతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లతతో పాటు తన దగ్గర ఉన్న మరో మైనర్ నిందితురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

మైనర్ నిందితురాలు సాయంతో లత బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. బాధిత బాలికతో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తెలిపింది. ఈ కిడ్నాప్ ప్లాన్ లో మైనర్ నిందితురాలి లవర్ హస్తం కూడా ఉందని గుర్తించారు పోలీసులు. మైనర్ నిందితురాలు లవర్ అబ్దుల్ అప్నాన్ సాయంతో మైనర్ బాలికకు మందు, గంజాయి అలవాటు చేసి తమ ట్రాప్ లో పడేలా చేశారని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసే సమయంలో వీడియో రికార్డ్ చేసారని..ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే.. వీడియోలు బయట పెడతామని బెదిరించినట్లు తెలిపింది బాలిక. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు  ముఠాలో కీలక నిందితురాలు లత, నవ్యతో పాటు అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ లను అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందుతురాలు ముస్కు లత ఇంటి వద్ద 4300 కండోమ్ పాకెట్స్ తో పాటు రూ. 7వేల 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఒక బ్రేజా కారు, 4 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

Also Read :  పట్టుదలకు చిరునామా, యువతకు స్ఫూర్తి సునీతా విలియమ్స్

Advertisment
Advertisment
Advertisment