V C Sajjanar: నెక్స్ట్ హర్షసాయి.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్!

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారి భరతం పడుతున్నారు వి.సి సజ్జనార్. తాజాగా యూట్యూబర్ హర్షసాయిని టార్గెట్ చేశారు. అతడి వీడియో షేర్ చేసి వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘసేవ చేస్తున్నట్టు.. బిల్డప్ ఇస్తున్నాడని హర్షసాయిపై మండిపడ్డారు.

New Update
VC Sajjanar serious warning to YouTuber Harsha Sai after sharing video

VC Sajjanar serious warning to YouTuber Harsha Sai after sharing video

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారి భరతం పడుతున్నారు మాజీ ఐపీఎస్, ప్రస్తుత టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీ.సీ సజ్జనార్. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి.. గేమింగ్ యాప్‌లను ఇప్పటి వరకు ఎవరెవరు ప్రమోట్ చేశారో వారికి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.

ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ఇప్పటికే వైజాగ్ యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బండాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అలాగే తాజాగా బయ్యా సన్నీ యాదవ్‌ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఆయన రియాక్ట్ అవ్వడంతో సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా.. వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. 

ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

నెక్స్ట్ టార్గెట్ హర్షసాయి

ఈ క్రమంలో వీ.సీ సజ్జనార్ మరో పాపులర్ యూట్యూబర్ హర్షసాయిని టార్గెట్ చేశారు. అతడికి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసి వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘసేవ చేస్తున్నట్టు.. బిల్డప్ ఇస్తున్నాడని హర్షసాయిపై మండిపడ్డారు. ఈ మేరకు ఫాలోవర్స్ అందరూ హర్షసాయి లాంటి వారిని అన్‌ఫాలో చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. 

‘‘చేస్తున్న‌దే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు! ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు.

ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగ‌నం డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి.’’ అని ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

కాగా సజ్జనార్ దెబ్బకు ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు అయింది. ఇక సజ్జనార్ లిస్టులో సురేఖవాణి కూతురు సుప్రియ, వినయ్ కుయ్యా, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, డేర్ స్టార్ గోపాల్, విజ్జు గౌడ్, శ్రీధర్ చాప వంటి యూట్యూబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ యూట్యూబర్లు వరుసగా అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Habsiguda: హబ్సిగూడలో తగలబడుతున్న కార్.. డ్రైవర్‌కు ఏమైందంటే?

హబ్సిగూడ‌లో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారును నిలిపివేసి బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తాకు సమీపంలో ఇది జరిగింది.

New Update
Hyderabad Ghatkesar car fire accident Three burnt alive

Hyderabad Habsiguda car caught fire

హైదరాబాద్‌లోని హబ్సిగూడలో దారుణమైన ప్రమాదం జరిగింది. ఒక కారు మంటల్లో బూడదైపోయింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు నిలిపి.. వెంటనే అందులోంచి బయటకు వచ్చేశాడు. ఎలగో అతడు ముందుగా గమనించి బండి దిగడంతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

కాగా ఆ కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తా రాకముందు ఈ ఘటన సంభవించింది. ఇక వెంటనే సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సమాచారాన్ని అందుకుని హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ రోడ్డులో ఏర్పడిన ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలో పడ్డారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ దేవుని దయవల్ల ఏం జరగలేదని మాట్లాడుకుంటున్నారు. 

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

USలో తెలంగాణ వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడంతో టేకులపల్లి గ్రామం శోకసద్రంలో మునిగిపోయింది.

Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు 

హైదరాబాద్‌‌లోనూ ప్రమాదం..

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం రోడ్డుపై వేగంగా వెళ్తు అదుపు తప్పడంతో మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిచారు. కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులోనే కారు నడిపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. కృష్ణానగర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
Advertisment
Advertisment
Advertisment