Viral Video: పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన వీడియో.. తల బాదుకున్న తండ్రి: రెప్పపాటులో!

టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ తాజాగా ఓ వీడియో షేర్ చేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అందులో ఓ బాలుడు రెప్ప పాటులో లారీ ప్రమాదం నుంచి బయటబడ్డట్టు కనిపించింది. తండ్రి నిర్లక్ష్యంగా జరిగిందని అందరూ జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలని అన్నారు.

New Update
V.C Sajjanar shared viral video parents must watch

V.C Sajjanar shared viral video parents must watch

సాధారంగా కొన్ని వీడియోలు చూస్తే వావ్, అద్భుతం అని అనకమానలేం. కానీ ఇంకొన్ని వీడియోలు మాత్రం చూసిన కొద్ది సెకన్లకే గుండె పగిలేంత పని అవుతుంది. అందులో ముఖ్యంగా యాక్సిడెంట్ వీడియోలు. తరచూ ఏదో ఒక చోట రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారుతుంటాయి. 

Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!

తాజాగా అలాంటిదే ఒక వీడియో (Video) నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అంతా దేవుని దయ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెప్ప పాటులో పోయే ప్రాణాన్ని దేవుడు ఎలా కాపాడాడో అంటున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. ఆ వీడియోలో ఏముంది అనే విషయానికొస్తే.. 

రెప్పపాటులో ఘోర ప్రమాదం

వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం.. ఒక తండ్రి తన కూతురు కొడుకుతో కలిసి బయటకు వెళ్లేందుకు స్కూటీపై కూర్చొన్నాడు. అందులో కూతురుని వెనుకవైపు కూర్చోబెట్టాడు. ఇక కొడుకును ముందువైపు కూర్చోబెట్టుకునే లోపు ఆ బాలుడు రోడ్డువైపు పరుగులు పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో అటువైపు నుంచి స్పీడుగా ఒక లారీ వచ్చింది. దీంతో లారీ చక్రాలకు.. ఆ బాలుడికి చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. రెప్పపాటులో ఆ బాలుడు బయటపడ్డాడు. ఆ సంఘటన కల్లారా చూసిన తండ్రి ఒక్కసారిగా తలపట్టుకుని ఉండిపోయాడు. 

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ఎండీ వి.సి సజ్జనార్ (V.C. Sajjanar) తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేశారు. అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ మేరకు చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా  ఉండాలి అని అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదు అంటూ ఆ పోస్టులో చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment