KCR: కేసీఆర్కు దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది.. బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ చీఫ్ కేసీఆర్ కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.  దొంగనోట్లు వ్యాపారం చేసి ఎన్నికల్లో దొంగనోట్లు పంచారని సంజయ్‌ సంచలన కామెంట్స్ చేశారు.

New Update
Bandi Sanjay Comments on Delhi Election Results

Bandi Sanjay Comments on Delhi Election Results

కేంద్రమంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ చీఫ్ కేసీఆర్ కు బీదర్‌లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.  దొంగనోట్లు వ్యాపారం చేసి ఎన్నికల్లో దొంగనోట్లు పంచారని సంజయ్‌ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని సంజయ్ ఆరోపించారు. దీనికి కేసీఆర్ మూర్ఖత్వమే కారణమని విమర్శించారు. తెలంగాణకు ఆరు కోట్ల అప్పు ఉందని సీఎం రేవంత్ చెబుతున్నారని..  హామీలు ఇచ్చినప్పుడు అప్పులు గుర్తుకులేవా అని సీఎం రేవంత్ ను నిలదీశారు.  అధికారంలోకి వచ్చాక ఏం చేద్దామని అనుకున్నారని సంజయ్ ప్రశ్నించారు.  అప్పులు తీర్చేందుకు ప్రభుత్వం భూములు అమ్మేందుకు సిద్ధమైందని సంజయ్ ఆరోపించారు.   

Also read : బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నంబర్ ఇదే!

Also read :  తల్లి డైరెక్షన్‌..కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

అధ్యక్ష పదవి ఇస్తే తీసుకుంటా

అంతకుముందు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనన్నారు. ఇస్తే వద్దనని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నానని తెలిపారు.  కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం  అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని..  ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని సంజయ్ చెప్పుకొచ్చారు. అలా ప్రచారం చేసుకుని  కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దన్నారు.  పార్టీ పెద్దలు అధ్యక్షుడ్ని నిర్ణయిస్తారని..తాను కేంద్ర సహాయమంత్రిగా ఉన్నానని బండి సంజయ్ తెలిపారు.  అధ్యక్ష పదవిపై కేంద్ర నాయకత్వం చాలా సీరియస్‌‌గా ఉందని అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అంతా కట్టుబడి ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సంజయ్ పిలునిచ్చారు.

Also read :  డ్రెస్ మార్చుకుంటుంటే డోర్ తీశాడు.. ఆ డైరెక్టర్ పై షాలిని కామెంట్స్

Also read :  గువాహటి ఐఐటీ పరిశోధకుల అద్బుతం.. అంతర్జాతీయ సరిహద్దులపై రోబోల నిఘా !

 

hyderabad | kcr | latest telangana news | telangana news today | telangana-news-updates | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime:  గోల్కొండలో ఘోరం.. బావను చంపిన బామ్మర్ది.. గొడవకు కారణం ఇదే!

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీ చేసిన బైక్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఎత్తుకొచ్చిన బైక్‌ను అమ్మి వాటా ఇవ్వలేదని బ్లేడ్‌తో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

New Update
golkonda crime news

golkonda crime news

TG Crime: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. చోరీ చేసిన బైక్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. దొంగతనంగా ఎత్తుకొచ్చిన బైక్‌ను అమ్మి తనకు వాటా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. బావను బామ్మార్ది చంపేసిన ఘటన హైదరాబాద్‌ గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. గోల్కొండలో ముఖిత్‌, సమీర్‌ బావ బామ్మర్దులు నివాసం ఉంటున్నారు. ముఖిత్‌ బైక్‌ను   దొంగిలించారు. బైక్‌ అమ్మి డబ్బులు ఇవ్వాలని బామ్మర్ది సమీర్‌కు చెప్పాడు. అయితే.. ఆదివారం ఉదయం టోలిచౌకి నుంచి సెవెన్‌ టూంబ్స్‌ వెళ్లే రోడ్డులో ఉన్న ఓ హోటల్‌ వద్ద ఇద్దరు కలుసుకున్నారు.  డబ్బు ఇచ్చే విషయంలో వాదులాడుకున్నారు. 

ఇది కూడా చదవండి: వయస్సు 50 ఏళ్లు దాటిందా..? రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలో తెలుసా..?

బ్లేడ్‌తో దాడి చేసి...

ఇద్దరు మధ్య మాటామాట పెరిగి అదికాస్తా పెద్ద గొడవకు దారిసింది. ఈ సమయంలో సహనం కోల్పోయిన సమీర్‌.. బావ ముఖిత్‌పై బ్లేడ్‌తో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ముఖిత్‌ అక్కడికక్కడే మరణించారు. చుట్టు పక్క స్థానికుల ఇచ్చిన సమాచారంతో.. ఘటనా స్థలానికి  పోలీసులు చేరుకున్నారు.  అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడి సమీర్‌ కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నిజంగానే.. కాకరకాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా?

ts-crime | ts-crime-news | latest-news )

Advertisment
Advertisment
Advertisment