/rtv/media/media_files/2025/12/08/telangana-rising-global-summit-2025-commenced-in-hyderabad-2025-12-08-15-17-05.jpg)
Telangana Rising Global Summit 2025 Commenced in Hyderabad
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సీఎం రేవంత్(cm-revanth), కేంద్రమంత్రి కిషన్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులతో పాటు సినీనటుడు నాగార్జున, పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో మొత్తం 100 ఎకరాల విస్తీర్ణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 8,9 రెండ్రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతోంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Telangana Rising Global Summit 2025
ఈ సమ్మిట్కు ముందు సీఎం రేవంత్ అక్కడికి చేరుకున్నారు. స్టాళ్లను పరిశీలించారు. అధికారులకు ఆయన పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం.. తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు రెండు వేల మంది దేశ, విదేశీ అతిథులు రానున్నాయి. దీంతో అత్యాధునిక హంగులతో అనేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం ఇచ్చే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం ఈ సదస్సులో వివరించనున్నారు.
The World arrives at the Telangana Rising Global Summit! #TelanganaRising2047#TelanganaRisingGlobalSummitpic.twitter.com/VuDm3JtQKn
— TelanganaRisingGlobalSummit (@GlobalSummitTG) December 8, 2025
Hyderabad takes flight today and so does Telangana Rising 2047.
— TelanganaRisingGlobalSummit (@GlobalSummitTG) December 8, 2025
The Telangana Rising Global Summit is officially underway! #TelanganaRising2047#TelanganaRisingGlobalSummitpic.twitter.com/l8HxZVs5fF
Also Read: కేరళలో కొత్త రోగం.. 42 మంది మృతి.. డేంజర్లో 170 మంది.. ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలుసా..?
Follow Us