MLC ELECTIONS 2025: కమ్యూనిస్టులకు ఒక ఎమ్మెల్సీ సీటు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం?

తెలంగాణ సీపీఐ కీలక నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది.

author-image
By Nikhil
New Update
Telangana MLA Quota MLC Elections

Telangana MLA Quota MLC Elections

తెలంగాణ (Telangana) లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC ELECTIONS 2025) ఈ రోజు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. అనంతరం ఈ నెల 20న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. అయితే.. ప్రస్తుత బలబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఐదు కన్నా ఒక్క నామినేషన్ ఎక్కువగా దాఖలైతే పోలింగ్ ఉంటుంది. లేకుంటే అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసేందుకు సీఎం రేవంత్ ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో చర్చించి తుది జాబితాను ఖరారు చేయనున్నారు సీఎం రేవంత్.

Also Read :  అయ్యో.. ఆ రాక్షడు నా చెల్లిని కొట్టి చంపాడు.. మలక్‌పేట శిరీష కేసులో బిగ్ ట్విస్ట్!

Also Read :  తణుకులో అఘోరీ సంచలనం.. వాన్ని చంపేస్తానంటూ బీభత్సం!

అయితే.. కాంగ్రెస్ మూడు సీట్లకే పరిమితమై నాలుగో సీటును సీపీఐ లేదా ఎంఐఎంకు కేటాయించే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది. ఈ రోజు సీపీఎం కీలక నేతలు చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ కావడం ఈ వార్తకు మరింత బలం చేకూరింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ పట్టుబట్టింది. కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం కొత్తగూడెం అసెంబ్లీ సీటును మాత్రమే కాంగ్రెస్ కు పొత్తుల్లో భాగంగా కేటాయించింది. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ సీటును ఇస్తామని సీపీఐకి హామీ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలని సీపీఐ పట్టుబడుతోంది.

Also Read :  మార్చి నుంచే దంచికొట్టనున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బే

మరో వైపు కాంగ్రెస్ లో దాదాపు డజన్ కు పైగా నేతలు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐకి ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని ఇప్పుడు నెరవేరుస్తుందా? లేక మరికొన్ని రోజులు ఆగాలని కోరుతుందా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్ తో భేటీ అయిన సీపీఐ నేతలు ఎమ్మెల్సీ పదవిని ఇప్పుడే ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ రోజు హైకమాండ్ పెద్దలతో భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ అంశంపై సైతం చర్చించనున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో్ చర్చ సాగుతోంది. 

ఆ ఎమ్మెల్సీ సీటు ఎవరికి?

ఒక వేళ కాంగ్రెస్ సీపీఐకి ఎమ్మెల్సీ టికెట్ ను కేటాయిస్తే.. అది ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ సాగుతోంది. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డికి ఆ ఎమ్మెల్సీని కేటాయించే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ను తమకు కేటాయించాలని సీపీఐ పట్టుబట్టింది. అక్కడి నుంచి చాడను బరిలోకి దించాలని భావించింది. కానీ కాంగ్రెస్ అందుకు నిరాకరించింది. దీంతో ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని సీపీఐలో చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read :  కట్నాల గ్రంథంతో ప్రసాద్ పెళ్లికొచ్చిన తిప్పలు.. పెళ్లికాని ప్రసాద్ టీజర్ భలే ఉందిగా..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్  లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...

అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

New Update
Girls Hostels

Girls Hostels

Ladies Hostels  : అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్న ఓ దొంగ వ్యవహారం మధురానగర్ లో చోటు చేసుకుంది.ఆ దొంగ అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగ‌ర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఓ లేడీస్ హాస్టల్లో వాచ్‌మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్‌మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్ హాస్టల్లో దూరింది దొంగా లేదా ప్రియుడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఎందుకంటే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్‌ను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే డోర్ కాస్తా ఓపెన్ చేసి ఉంది.సాధారణంగా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. లేదా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ హాస్టల్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ అయిన ఉండటం వీడియోలో చూడవచ్చు. అలాగే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా తన ఫేస్‌కు ఎలాంటి మాస్క్ ధరించలేదు. సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తి, తన ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ కూడా జరిగినట్టు కనిపించడం లేదు. పైగా అతను గోడ దూకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉన్న బ్యాగ్ కూడా అంత బరువుగా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో వచ్చింది అసలు దొంగనే అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న యువతి కోసం సదరు వ్యక్తి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

 
Advertisment
Advertisment
Advertisment