AGHORI: తన్నులు తిన్న అఘోరి.. ఆమె రాకపోతే చచ్చిపోతానంటూ రచ్చ రచ్చ!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోసం వెళ్లిన అఘోరిని రాజేష్‌నాథ్‌ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. అఘోరి, వర్షిణి, రాజేష్‌నాథ్‌ ఈ ముగ్గురికి సంబంధించిన ఆడియో చర్చనీయాంశమైంది.

New Update

AGHORI: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోసం వెళ్లిన అఘోరిని ఓ రాజేష్‌నాథ్‌ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. వర్షిణికి దీక్ష ఇచ్చినట్లు అఘోరీ చెప్పిన ఆడియో లీక్ కావడం చర్చనీయాంశమైంది. అయితే అతను చితకబాదుతున్నా అఘోరి సైలెంట్‌గా ఉండిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిణి, అఘోరి, రాజేష్‌నాథ్‌కు మధ్య సంబంధంపై ఆరాతీస్తున్నారు. ఆడియో కాల్‌లో అఘోరీకి, అమ్మాయికి మధ్య సంభాషణ జరగగా.. తనను చూసేందుకు రాకపోతే చచ్చిపోతానంటూ అఘోరీని బెదిరింపులు గురిచేసింది వర్షిణి. ఈ వ్యవహారం మరోసారి రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతుండగా పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

ఆ యువతిని కూతురిలా..

తురెమెల్ల శ్రీవర్షిణి అనే ఒక యువతికి తాను దీక్ష ఇచ్చి.. సాధన నేర్పిస్తున్నానని తెలిపింది. ఆ యువతి జీవితాంతం తనతోనే ఉంటుందని పేర్కొంది. ఆమె బరువు బాధ్యతలు కూడా తానే తీసుకుంటున్నానని తెలిపింది. ఇలా చాలా మంది ఆడ పిల్లలు ఇప్పుడిప్పుడే తనవద్దకు వస్తున్నారని.. ఎవరైనా సరే ఇష్టపడి శిక్షణ నేర్చుకోవాలి అని అనుకుంటే.. భగవంతునికి సేవ చేసుకోవాలి అనుకుంటే తాను నేర్పిస్తానని తెలిపింది. తనను నమ్ముకుని వచ్చిన ఆడబిడ్డలను మంచి స్థితికి తీసుకుని వెళ్తానని చెప్పింది.  ఇక తనతో పాటు ఉన్న ఆడ బిడ్డను కూడా తనలాగే మహిళల కోసం పోరాడే వ్యక్తిలా తీర్చి దిద్దుతానని తెలిపింది.  

Also Read: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్

ఆడ పిల్లలను ఆడ పులిలా..

ఒక రోజు ఆ యువతి తనకు కాల్ చేసిందని.. తన దగ్గర దీక్ష తీసుకుంటానని చెప్పడంతో పరిచయం అయిందని పేర్కొంది. ఇక ఇలాంటి ఆడపిల్లలకు మాత్రమే తాను సాధన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఆడ పిల్లలను ఆడ పులిలా తీర్చి దిద్దడమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే అఘోరీ వద్ద దీక్ష తీసుకున్నాను. ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు.. ఇంట్లో వాళ్లందరూ ఒప్పుకున్నాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక బీటెక్ స్టూడెంట్‌ని. ఇక నుంచి అఘీరీ అమ్మే అన్నీ చూసుకుంటానని చెప్పింది. సొంత కూతురిలా నన్ను చదివిస్తానని మాట ఇచ్చింది. ఆ నమ్మకంతోనే అఘోరీ అమ్మతో.. ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను అని ఆ యువతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ  వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది.

New Update
hyd

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రానున్న రెండు రోజులు.. పాటు బుధవారం, శుక్రవారం భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Also Read: Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!

IMD విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో ఏప్రిల్ 9వ తేదీన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అంతేకాకుండా.. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Telangana Rain Alert

ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షితమైన చోటుకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. నిన్న హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రానున్న వర్షాల నేపథ్యంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను సూచిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల తర్వాత ఒక్కసారిగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ప్రజలు ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక నిజామాబాద్ జిల్లాలో వాతావరణంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపు ఐదు రోజుల క్రితం ఈ జిల్లాలో బలమైన ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీని ఫలితంగా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే.. వారం రోజుల పాటు చల్లగా ఉన్న వాతావరణం ఆదివారం నుండి మళ్లీ వేడిగా మారుతుంది. గత మూడు రోజులుగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అయితే.. రానున్న వర్ష సూచనతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనపడుతున్నాయి.

వాతావరణ శాఖ ఈ హెచ్చరికల నేపథ్యంలో.. ఆ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తగిన సూచనలు జారీ చేయడంతో పాటు.. సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీ గా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున.. మరమ్మత్తు బృందాలను ముందుగానే సిద్ధం చేశారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

Also Read: Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్‌ చిన్న కుమారుడు!

Also Read: America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

telngana | adilabad | nizamabad | rains | rain-alert | telangana-rain | telangana rain alert | telangana rains today | telangana rains update | telangana rains updates | telangana-rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment