/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Runa-Mafi.jpg)
Rythu Bharosa
Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతులకు అందించే పెట్టుబడి సాయంలో టెక్నాలజీని ఉపయోగించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా రైతుల నుంచి దరఖాస్తులు సేకరించడంతోపాటు ప్రత్యేక వెబ్సైట్లేదా యాప్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్సబ్కమిటీ సమావేశమవగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు కీలక సూచనలు చేశారు. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వనుండగా సీఎం రేవంత్రెడ్డి సూచించిన విధివిధానాలను కార్యరూపం దాల్చేందుకు కేబినెట్సబ్కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రైతు భరోసా కావాలంటే అప్లికేషన్ తప్పనిసరి..
అయితే రైతు భరోసా కావాలనుకునేవారు అప్లికేషన్లుచేసుకోవాలనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. రైతు పేరు, పట్టాదారు పాసు పుస్తకం నంబర్, ఫోన్నంబర్తోపాటుఊరు, మండలం, జిల్లా వివరాలతోకూడాని ఆన్లైన్ అప్లికేషన్ పెడితే సులభంగా ఉంటుందని సబ్ కమిటీ చర్చలు జరిపింది. ఇందులో భాగంగానే ప్రత్యేక వెబ్సైట్, యాప్ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎందుకంటే ఈ పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా రాజకీయనేతలు, ప్రభుత్వ ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకుంటారా లేదా అనేది బయటపడుతుందని భావిస్తున్నారు. ఇంతకు ముందు రైతు బంధు కోసం పెట్టిన ‘గివ్ ఇట్ అప్’ వల్ల ప్రయోజనం లేదని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Also Read: దరఖాస్తు చేసుకుంటేనే రైతు భరోసా.. రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్
రెండు దశల్లో వెరిఫికేషన్..
ఇక దరఖాస్తు చేసుకున్న భూముల్లో గుట్టలు, రోడ్లు, చెరువులు, గవర్నమెంట్ భూములకు సంబంధించి గుట్టు బయటపడనుంది. ఆ భూములను అగ్రికల్చర్నుంచి తొలగించి నోషనల్ఖాతాలోకి తర్జుమా చేసే అవకాశం కూడా ఉంది. అందుకే రైతుల నుంచి అప్లికేషన్ వచ్చిన తర్వాత సీసీఎల్ఏలోని డేటాను పరిశీలించి అక్రమాలు చోటుచేసుకోకుండా చూడొచ్చని ఆలోచిస్తున్నారు. రెండు దశల్లో వెరిఫికేషన్నిర్ధారించి సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్సబ్కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాగు చేసిన భూమిని మాత్రమే గుర్తించేందుకు ఫీల్డ్వెరిఫికేషన్, శాటిలైట్సర్వేను వాడుకలోకి తీసుకురానున్నారు.
ఇది కూడా చదవండి: Cricket: కాబోయే కెప్టెన్ నితీష్రెడ్డినే.. చాముండేశ్వరీనాథ్ సంచలనం!
గత ప్రభుత్వం 2018–19, 2022–2023లో రూ.22,600 కోట్ల నిధులు సాగు చేయని భూములకు ఇచ్చినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది. సాగు భూములకే రైతు భరోసా ఇస్తే పెట్టుబడి సాయం పక్కదారి పట్టదని భావిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చితీరుతుందని సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్లో వ్యవసాయం, వ్యవసాయంతో సంబంధమున్న రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించినట్లు భట్టి చెప్పారు. రుణమాఫీ కోసం రూ.21 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామన్నారు.
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
BRS meeting
KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాంగ్రెస్ ను తిరస్కరించండి
‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం