రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!
TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు హరీష్ రావు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్నలకు రూ.500 బోనస్ ఇవ్వడమే రైతులకు మేలు అని మంత్రి అంటున్నారని అన్నారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును రద్దు చేయాలని చూస్తోందని ఆరోపించారు హరీష్ రావు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్నలకు రూ.500 బోనస్ ఇవ్వడమే రైతులకు మేలు అని మంత్రి అంటున్నారని అన్నారు.
TG: రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కొమురవెల్లి దేవస్థానానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. రూ. కోటి అవకతవకలకు సంబంధించి ఐదేండ్ల కిందటి ఫైళ్లు మాయం కావడంతో ముగ్గురు ఉద్యోగులకు కమిషనరేట్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో అందజేయకుంటే క్రిమినల్ చర్యలుంటాయని హచ్చరించింది.
అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని సీఎం రేవంత్ తిరస్కరించడంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి సరే.. ఆదానితో దావోస్ లో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటో చెప్పాలన్నారు. అదానీతో అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
TG: సిద్దిపేట జిల్లా దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) మాజీ ఎమ్మెల్యే, KCR మిత్రుడు దొమ్మాట రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
తమ ఇంట్లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు. 4 ఏళ్ల తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి కొండా సురేఖ స్టాఫ్ కు పార్టీ ఇచ్చిందన్నారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి కొన్న భూములపై విచారణ జరిపిస్తున్నామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో తనకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే రేవంత్ రెడ్డి లగచర్లలో కుట్ర చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. రైతులపై పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని, జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
KTR అరెస్ట్ కథ కంచికేనని.. ఢిల్లీలో సెటిల్మెంట్ జరగడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ ఇక గాలికేనన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు.