BREAKING: కేసీఆర్ మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

TG: సిద్దిపేట జిల్లా దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) మాజీ ఎమ్మెల్యే, KCR మిత్రుడు దొమ్మాట రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

New Update
RAMACHANDRA REDDY

Ramachandra Reddy: కేసీఆర్ మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోనో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. సిద్దిపేట జిల్లా కొండపాక సొంత ఊరు. ఆయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు.

సిద్ధిపేట నుంచి కేసీఆర్...!

కాగా 1985లో సిద్దిపేట జిల్లా దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి తెలుగు దేశం పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఈయన మంచి మిత్రుడు.. అలాగే  రాజకీయ సమకాలికులు. ఆ కాలంలో కేసీఆర్ సిద్ధిపేట నియోజకవర్గం నుంచి...  రామచంద్రారెడ్డి దుబ్బాక నుండి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ని బలపరిచిన నాయకులుగా వీరు ఉన్నారు. తాజాగా ఆయన మరణవార్త తెలుసుకున్న నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

Also Read: మహారాష్ట్ర సీఎం ఎవరూ ? మరికొన్ని గంటల్లో స్పష్టత

Also Read: కేసీఆర్ మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoists Surrenders : మావోయిస్టులకు షాక్‌...13 మంది లొంగుబాటు

వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

New Update
Maoists Surrenders

Maoists Surrenders

Maoists Surrenders : సమసమాజ నిర్మాణమే ధ్యేయమనే లక్ష్యంతో ఆయుధాలు పట్టి అడవుల్లో పోరాడుతున్న మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది.  తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులకు రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తెలంగాణ పోలీసులు కల్పించిన అవహాగాహనతో వీరంతా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 250 మంది మావోయిస్టులు లొంగిపోతే వారిలో 90 శాతం మంది ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు. వారందరూ ఇక మీదట మావోయిస్టులకు సహకరించమని తేల్చి చెప్పారన్నారు. వారికి అందజేసిన రివార్డులతో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఇక ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో తెలంగాణ పోలీసుల ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ కూంబింగ్ ఛత్తీస్ గఢ్, కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ అన్నారు. ఈ విషయంలో మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రమేయం లేదన్నారు. కర్రెగుట్ట ఘటనలో మావోయిస్టులు ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదని తేల్చి చెప్పారు.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

Advertisment
Advertisment
Advertisment