/rtv/media/media_files/2025/12/07/key-update-on-local-body-elections-in-telangana-2025-12-07-20-22-11.jpg)
Key update on local body elections in telangana
తెలంగాణలో పంచాయతీ ఎన్నిక(local-body-elections)ల జాతర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం(election-commission) నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. రెండో విడుత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 415 మంది సర్పంచ్లు, 8304 మంది వార్డు మెంబర్లు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. కామరెడ్డిలో అత్యధికంగా 44 పంచాయతీల్లో ఏకగ్రీవం జరిగింది. ఇక నిజామాబాద్, నల్గొండలో 38 గ్రామాల చొప్పున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Also Read: ఎక్స్లో కేసీఆర్పై కేటీఆర్ ఇంట్రస్టింగ్ పోస్ట్..
Local Body Elections 2025
రెండో విడతలో 4332 గ్రామాలు, 38,322 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీఫికేషన్ ఇచ్చింది. కానీ అయిదు గ్రామపంచాయతీలు, 107 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం. అలాగా సర్పంచి ఎన్నిక మొదటి విడుత నుంచి 7,584 మంది, వార్డుల్లో 10,427 మంది తమ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. మొదటి విడుతతో కలిసి మొత్తం 810 మంది సర్పంచ్లు, 17,635 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Also Read : గజ గజ వణుకుతున్న తెలంగాణ.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
Follow Us