Telangana Rains:తెలంగాణలో భారీ వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..!

తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా.. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్లు కురిశాయి.

New Update

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గతకొద్ది రోజులుగా నిప్పులు కురిపిస్తున్న సూర్యూడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. మధ్యాహ్నం వరకూ నిప్పుల వానలు పడుతూంటే...ఉన్నట్టుండి నిప్పులు కాస్త వడగండ్లలా మారాయి. వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వండగండ్లు కూడా పడ్డాయి. 

Also Read: IPL 2025: నేటి నుంచే ఐపీఎల్.. నాలుగు కొత్త రూల్స్ తో..

ముఖ్యంగా.. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురవటం గమనార్హం. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు పడ్డాయి.మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ధర్మపురి మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది నేరేళ్ల, తుమ్మేనాల, ధర్మపురి, తిమ్మాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. 

Also Read: BSNL: కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోనూ భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వాతావరణ శాఖ, వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే వడగండ్ల వాన కురిసింది. అయితే.. ఈ వర్షంతో సామాన్యులకు ఎండ నుంచి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం దొరికినప్పటికీ.. రైతులకు మాత్రం తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది.

చాలా ప్రాంతాల్లో పంటలు చివరి దశలో ఉండగా.. ఉన్నట్టుండి ఈ వడగండ్లు కురవటం వల్ల చేతికొచ్చే పంట నేలపాలయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు.. ఈ అకాల వర్షాలతో కోతకొచ్చిన మామిడి తోటలు, పిందె దశలో ఉన్న మామిడి తోటలు తీవ్ర స్థాయిలో దెబ్బతినే అవకాశాలున్నాయి. మరి ఈ వడగండ్లతో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నష్టం వాటిల్లిందన్నది తెలియాల్సి ఉంది.

రానున్న 2 రోజుల్లో...

ఇదిలా ఉంటే.. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్లు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావారణ శాఖ అధికారులు.

Also Read: IPL 2025: కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా?

Also Read: Breaking News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్‌ డీసీపీ స్పాట్‌ డెడ్‌!

telangana | hyderabad | rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment