Hydra: అక్కడ ప్లాట్లు కొంటే పాట్లు తప్పవు...హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లకు ఛాన్స్ లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పేశారు. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ప్రజలను అప్రమత్తం చేస్తూ నోట్ రిలీజ్ చేశారు. 

New Update
hydra

Hydra commissioner Ranganath

హైదరాబాద్ (Hyderabad) శివార్లలో ప్రభుత్వ అనుమతి ఉందని చెబుతూ ఫామ్ ల్యాండ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని హైడ్రా (Hydra) కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దీనిపై ఆయన కీలక ప్రకటన చేశారు. అనధికారిక లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికావొద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఇలాంటి భూముల మీద ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయని ఆయన వివరించారు. రాజేంద్రనగర్‌ మండలం, లక్ష్మిగూడలోని 50వ సర్వే నంబరులోని ఎకరం రెండు గుంటల భూమిని ఫామ్‌ల్యాండ్‌ పేరుతో ప్లాట్లుగా అమ్ముతున్నారని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారని తెలిపారు. 

Also Read: Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు

Also Read :  ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు.. 20 రాష్ట్రాల CMలు, 50 మంది సెలబ్రెటీలు

ప్రభుత్వ అనుమతుల్లేవు..

ప్లాట్లు అమ్మాలన్నా, లే అవుట్లు ఏర్పాటు చేయాలన్నా రూల్ ప్రకారం ప్రభుత్వ అనుమతి ఉండాలి. అలా అనుమతించి వాటిని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని తప్పించుకునేందుకు చాలా మంది వాటిని వ్యవసాయ భూములుగా మార్చి ప్లాట్లుగా అమ్మేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ (Ranganath) తెలిపారు. అలా అమ్మాలంటే గజాల్లో కాకుండా కనీసం అర్ధ ఎకరా భూమిని విక్రయించాలి. అప్పుడే రిజిస్ట్రేషన్‌ చేయాలని 2018లోనే ప్రభుత్వం  ఆదేశాలిచ్చింది. అయినా కొందరు అధికారులు వీటిని  పట్టించుకోవట్లేదు. అలాంటి వారిపై, సంస్థలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జీవో నంబరు 131 ప్రకారం ఆగస్టు 31, 2020 తర్వాత అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా మంజూరు చేయలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. అలా అనుమతి లేకుండా కట్టిన కట్టడాలను కూల్చేస్తామని హైడ్రా కమిషనర్‌ ప్రజలకు సూచన చేశారు.

Also Read: Kerala: హమాస్ నేతల ఫోటోలతో కేరళలో ఏనుగులతో ఊరేగింపు

Also Read :  బాలరాముడికి భారీగా విరాళాలు.. అయోధ్య రామమందిరం ఆదాయం దేశంలోనే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sri Rama Navami Shobha Yatra : వైభవంగా కొనసాగుతోన్న శ్రీరామ శోభాయాత్ర

హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. మంగళ్‌హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది.

New Update
Sri Rama Navami Shobha Yatra

Sri Rama Navami Shobha Yatra

Sri Rama Navami Shobha Yatra : హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. నగరంలోని మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది. కాగా శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా పలు హిందూ సంఘాలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.3 కి.మీ మేర ఈ శోభాయాత్ర సాగుతుంది.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

 ఈ శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. దాదాపు 20 వేల మంది విధుల్లో ఉండి పర్యవేక్షించనున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
 
శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతలో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులు శోభాయాత్రను మానిటర్ చేయనున్నారు. భక్తులు శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. 

Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

Advertisment
Advertisment
Advertisment