Group-1: గ్రూప్‌-1 పేపర్లు రీవాల్యుయేషన్‌ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్

గ్రూప్‌ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పలవురు దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్ష పేపర్లను మళ్లీ రీవాల్యుయేషన్‌ చేయించాలని కోరారు.

New Update
Telangana High Court

Telangana High Court

ఇటీవల తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్‌ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీని మూల్యాంకనం సిరిగ్గా చేయలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే పలవురు అభ్యర్థులు దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్ష పేపర్లను మళ్లీ రీవాల్యుయేషన్‌ చేయించాలని కోరారు. '' గ్రూప్‌ 1లో 18 రకాల సబ్జెక్టులున్నాయి. కానీ 12 మంది సబ్జెక్ నిపుణులతో పేపర్లు దిద్దించారు.    

Also Read: కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్‌ నేతలు

మూడు భాషల్లో పరీక్షలు జరిగాయి. కానీ తగిన నిపుణులతో పేపర్లు దిద్దించలేదు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వాళ్లతో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ మీడియం పేపర్లు కూడా దిద్దించారు. ఇలా చేయడం వల్ల మూల్యాంకనంలో నాణ్యత లేకుండా పోయింది. దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని'' పిటిషనర్లు తెలిపారు. 

Also Read: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ

Group-1 Revaluation Of Exam Papers

పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC)కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోనే కౌంట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. 

Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!

ఇదిలాఉండగా రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్1 మెయిన్​ ఎగ్జామ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 31,403 మందిని ఎంపిక చేయగా.. 21,093 మంది మాత్రమే హాజరయ్యారు. ఇంగ్లీష్తో పాటు మరో ఆరు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. ఇటీవలే పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి.  

Also Read: వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అపర కుభేరుడు.. లగ్జరీ నౌకలో పెళ్లి!

 

rtv-news | group-1 | high-court | telangana-high-court | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment