LRS Concession Offer: గుడ్‌న్యూస్‌.... ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరో నెల పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) రాయితీ గడువును పొడిగించింది. ఏప్రిల్ 30వరకు అవకాశం కల్పించింది. గత నాలుగేళ్లుగాపెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

New Update
LRS registration

LRS registration Photograph: (LRS registration)

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) రాయితీ గడువును పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. మొదట మార్చి 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఆ లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం మేర రాయితీ ప్రకటించారు. అయితే ఈ గడువు ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

LRS Concession Offer

అయితే రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా ఆశించినంత మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్న మేర స్పందన కూడా రాలేదు. దీనిలో భాగంగానే.. మరో సారి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగించింది. ఇప్పటి వరకు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకు ఫీజు చెల్లించారు. పథకం అమలు తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. దీనిని అధికారులు పరష్కరించేలోపే గడువు తేదీ సమీపించింది. దీంతో పాటు వరుసగా ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో చివరి రెండు రోజులు కార్యకలాపాలు సాగలేదు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తడంతో.. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఓటీఎస్‌ను మరో నెల రోజులు పొడిగించింది.

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

2024-25 ఆర్థిక సంవత్సరం చివరి రోజున అంటే మార్చి 31న 43,700 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీజు చెల్లించారు. ఆ ఒక్క రోజే ఫీజు కింద దాదాపు రూ.124 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారాలు తెలిపారు. అయితే ఈ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోగా.. ఏప్రిల్ 1వ తేదీన కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీని వర్తింపజేశారు.

ఇది కూడా చదవండి: చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు

Also Read :  పరికిణీలో నభా అందాల జాతర.. చూస్తే ఫ్లాటే

 

lrs-telangana | LRS Discount | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment