/rtv/media/media_files/2025/03/24/VPKpOcoXN8UZw0Ow1OKM.jpg)
CM Revanth, Batti Vikra marka and Uttam Kumar Reddy
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్తో పాటు పలువురు కీలక నేతలు ఢిల్లీ బయలుదేరారు. సోమవారం మధ్యాహ్నం.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో వీళ్లు సమావేశం కానున్నారు.
Also Read: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ
ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. రేవంత్ ప్రభుత్వం ఈ కేబినెట్ విస్తరణ ప్రక్రియను ప్రతీసారి వాయిదా వేస్తూ వస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్పై కేబినెట్ విస్తరణకు సంబంధించి విమర్శలు చేస్తూ వస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ ఉంటుందా ? లేదా తర్వాత ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది .
Congress High Command Calls
Also Read: అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. కొత్తగా కొన్న ప్యాంట్ జేబులో డబ్బే డబ్బు!
ఇదిలాఉండగా సీఎం రేవంత్ ఏప్రిల్లో జపాన్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి 23వ తేది వరకు జపాన్ పర్యటన చేయనున్నారు. ఒసాకాలో ఇండస్ట్రియల్ ఎక్స్పోలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పెట్టబడుల కోసం వివిధ పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కూడా జపాన్కు వెళ్లనున్నారు. అయితే జపాన్ పర్యటన లోపే హైదరాబాద్లో డీలిమిటేషన్పై రేవంత్ సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది .
Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!
Also Read: వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అపర కుభేరుడు.. లగ్జరీ నౌకలో పెళ్లి!
Delhi Congress High Command | cm revanth | cabinet-expansion | telangana latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | t-congress