TG SSC Exam : పదో తరగతి పరీక్షల్లో గందరగోళం ఒక పేపర్ కు బదులు మరో పేపర్

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే  గందరగోళం నెలకొంది. పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.

author-image
By Kusuma
New Update
telangana 1oth class exams

telangana 1oth class exams

TG SSC Exam : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే  గందరగోళం నెలకొంది. పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.  తెలుగు పేపర్‌కు బదులు విద్యార్థులకు హిందీ పేపర్ ఇచ్చిన ఘటన సంచలనం రేపింది. ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్‌లో జరిగిన ఈ ఘటనలో తెలుగు పేపర్‌ కు  బదులు హిందీ పేపర్‌ వచ్చింది గమనించకుండా.. సెంటర్ నిర్వాహకులు పరీక్ష నిర్వహించారు.  ఆ తర్వాత నాలుక్కరుచుకుని  విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు. అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.  

Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాయ్స్‌ హైస్కూల్‌లో అధికారుల నిర్లక్ష్యం వల్ల  రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాయి. అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.  ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షా సమయం పూర్తయినా విద్యార్థులు.. బయటికి రాకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళనకు గురయ్యారు.

Also Read: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!

కలెక్టర్ సీరియస్


కాగా ఈ విషయం తెలిసి ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన జిల్లా కలెక్ట్ కుమార్ దీపక్‌ విద్యాధికారుల తీరుపై సీరియస్‌ అయ్యారు. ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

 Also Read :  తెలంగాణ హైకోర్టుకు యాంకర్‌ శ్యామల!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Revanth Reddy : రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రముఖ కంపెనీ బిగ్ షాక్.....యూనిట్‌ ఏర్పాటుపై వెనక్కి.....

రేవంత్ రెడ్డి సర్కారుకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను సంస్థ ఖండించింది. హైదరాబాద్‌లో ప్లాంట్ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

New Update
Byd Electric Cars

Byd Electric Cars

Revanth Reddy : రేవంత్ రెడ్డి సర్కారుకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ బీవైడీ (BYD) బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను బీవైడీ సంస్థ ఖండించింది. హైదరాబాద్‌లో ప్లాంట్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది.

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

బీవైడీ సంస్థ ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, ఇక్కడ సొంత ఉత్పత్తి యూనిట్ లేదు. ప్రస్తుతం చైనాలో ఉత్పత్తి చేసిన కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల అధిక సుంకం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో.. భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కంపెనీ కొంతకాలంగా యోచిస్తోంది. దీంతో హైదరాబాద్‌లో యూనిట్‌ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం బీవైడీతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే.. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్ సమీపంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వైరలయ్యాయి. కాగా.. ఈ కథనాలు సంస్థ దృష్టికి వెళ్లటంతో.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కంపెనీ స్పష్టం చేసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

ప్రపంచంలోనే నెంబర్ వన్ ఈవీ సంస్థ అయిన బీవైడీ.. హైదరాబాద్‌‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని.. సుమారు రూ.70 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. బీవైడీ కంపెనీ పెట్టుబడితో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా.. ఈ కంపెనీ హైదరాబాద్‌కు వస్తే.. దేశీయ ఈవీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కూడా అందరూ ఆలోచించారు. కాగా.. ఈ వార్తలను బీవైడీ కంపెనీ పూర్తిగా ఖండించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అయితే, ఈ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ ఫలితంగానే బీవైడీ  లాంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఈ ప్లాంట్ రాష్ట్రానికి రావడంలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర కీలకమని, దీని కోసం చాలా సంవత్సరాలు కృషి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే బీవైడీ తన నిర్ణయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ.. భవిష్యత్తులో కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు