SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి SC సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎస్సీ సంఘాల నేతలతో సీఎం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నా పట్టుదలతో ఎస్సీ వర్గీకరణ చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు.

New Update

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్సీ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, టీపీసీసీ ఛైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ సంఘాల నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళిగా రెండు నిమిషాలు మోనం పాటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ధుతున్నామన్నారు. పట్టుదలతో ఈ జాతికి న్యాయం చేశామని ఆయన తెలిపారు.

Also read :  బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక ఒప్పందాలు!

వర్గీకరణ.. మాదిగల న్యాయమైన హక్కు అని ఆయన పునరుద్ఘటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో వర్గీకరణ గురించి అధ్యయనం చేసి భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు రాకుండా.. రిటైర్ట్ జడ్జ్‌తో వన్ మెన్ కమిషన్ వేశామని రేవంత్ రెడ్డి వివరించారు. కమిషన్ 199 పేజీల నివేదికను సమర్పించింది. మూడు గ్రూపులుగా విభజించామన్నారు. ఎస్సీ వర్గీకరణ.. ఎవరికీ వ్యతిరేకం కాదు.. మాదిగల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమని తెలిపారు. గతంలో వర్గీకరణపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. నన్ను సభనుండి బయటికి పంపించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

Also read :  మమ్ముట్టి కోసం పూజలు చేసిన మోహన్‌లాల్.. ఏం జరిగిందంటే?

బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ చేయలేదని మంద కృష్న మాదిగ గుర్తించాలని ఆయన కోరాడు. రాహుల్ గాంధీ పట్టుబట్టి ఎస్సీ వర్గీకరణ జరగడానికి ఆయనకు ఎంతో శక్తిని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వివరించారు. మాల, మాదిగల వర్గీకరణ ఎన్నో ఏళ్ల చిక్కుముడి.. దానికి పరిష్కారం చూపించామని చెప్పుకొచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

New Update
BRS meeting

BRS meeting

KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

 కాంగ్రెస్ ను తిరస్కరించండి


‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్


ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

Advertisment
Advertisment
Advertisment