/rtv/media/media_files/2025/02/21/BPzGUvWFq1wTvWKAvty0.jpg)
CM Revanth inaugurated women association petrol pump in Narayanpet
TG News: మహిళలకు తెలంగాణ ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల సమయంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చిన ఆయన ఆ దిశగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్ పల్లిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఇది బీపీసీఎల్ కంపెనీ సహకారంతో పూర్తిగా మహిళలే నడిపించనున్నారు. ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకోవడం సంతోషం ఉందని, ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు..
మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని మా ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం. ఈ పెట్రోల్ బంక్ రాష్ట్రంలోనే మొదటిది. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం. గమహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చాం. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నాం. సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నాం. రూరల్, అర్బన్ అనే తేడా లేదు తెలంగాణలో మహిళలంతా ఒక్కటే అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Krishna Water Dispute: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల లొల్లి.. అసలేంటి వివాదం ?
ఇక అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందామన్నారు సీఎం రేవంత్. ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టండి నిధులు మేం ఇస్తాం. నిర్వహణ మీరు చేయండి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ... 70శాతం సక్సెస్ రేటు!