/rtv/media/media_files/2025/02/13/WTY2Krdh510eGuwtfkig.jpg)
Bhadradri kottagudem 19 Maoists surrendered
Maoist: మవోయిస్టులకు మరో భారీ దెబ్బ పడింది. భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కమాండర్ గా వ్యవహరిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కు చెందిన ముగ్గురు సభ్యులున్నారు. పోరాడలేక అలసిపోయామని, సాధారణ జీవితం గడిపేందుకే లొంగిపోయినట్లు మావోయిస్టులు చెబుతున్నారు.
మావోలకు ఆపరేషన్ చేయూత..
ఈ మేరకు జనజీవన స్రవంతిలో కలిసే మావోలకు ఆపరేషన్ చేయూత పేరిట ప్రత్యేక సరెండర్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు కొంతమంది తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. వారిలో సౌత్ బస్తర్ డీవీసీఎం నరోటి మనీష్ అలియాస్ ఆకాష్ ఉండగా అతనిపై రూ. 8లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ మొదటి బెటాలియన్ కు చెందిన మడివి నంద, మడివి హండా , మడివి హడమ సహా పలువురు సెంట్రల్ కమిటీ మెంబర్లకు గార్డుగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.
నందా, హండాపై 4లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!
ఇక పలు విధ్వంసకర ఘటనల్లో కీలకపాత్ర పోషించిన 19 మంది మావోయిస్టులు ఆ పార్టీ సభ్యుల సరెండర్ లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు భద్రాధ్రికొత్తగూడెం పోలీస్ యూనిట్ తెలిపింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 78 మంది మావోయిస్టులను సరెండర్ చేసి 64 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. లొంగిపోయిన 78 మందిలో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ సహా 16 మంది ఏరియాకమిటీ మెంబర్లున్నట్లు చెప్పింది. గత ఏడాది జరిపిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో తెలంగాణ గ్రేహౌండ్స్, భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పోలీసులు మొత్తం ఏడుగురిని మట్టుబెట్టారు.
మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సభ్యుడు నల్లమరి అశోక్ అలియాస్ విజేందర్ మణుగూరుతోపాటు పాల్వంచ డీసీఎం కమాండర్ లచ్చన్న టీంను వాష్ అవుట్ చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. స్టేట్ కమిటీ మెంబర్ ఇల్లందు - నర్సంపేట ఏరియా కమాండర్ మావోయిస్టు భధ్రు టీంను గత ఏడాది ములుగులో ఎన్ కౌంటర్ చేశారు. భద్రాధ్రికొత్తగూడెం జిల్లా సరిహద్దు అటవీప్రాంతంలో లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ఎదుట ప్రవేశపెట్టగా ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ , ఓఎస్డీ పరితోష్ పంకజ్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ కమాండెట్స్ రాజేష్ గోండ్రా పాల్గొన్నారు.