ఆ 8 మంది బతికే అవకాశముందా ? NDRF బృందం షాకింగ్ రియాక్షన్ | NDRF Team Shocking Facts Revealed | RTV
SLBC సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఉత్తరాఖాండ్ నుంచి నిపుణులు టీంను పిలిపించారు. రెస్క్యూ టీంతోపాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టన్నల్ లోపలికి వెళ్లారు. టన్నెల్లో మూడున్నర మీటర్లు బురద పేరుకుపోయి ఉంది.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు.
శనివారం ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.