/rtv/media/media_files/2025/02/23/ffVvzEYvuOfy5n7GCGHd.jpg)
jupalli at slbc Photograph: (jupalli at slbc)
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో స్వయంగా మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీం ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుంది. టన్నల్లోపల చిక్కుకున్న వారిని కాపాడటానికి ఉత్తరాఖాండ్ నుంచి నిపుణులు టీంను పిలిపించారు. రెస్క్యూ టీంతోపాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా టన్నల్ లోపలికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఇంజనీరింగ్, సహాయక బృందాలకు మంత్రి దిశానిర్ధేశం చేశారు.
మధ్యాహ్నం 1 గంటకు సిబ్బందితోపాటు టన్నల్లోకి వెళ్లిన మంత్రి ఆరు గంటలుగా వారితోనే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్లోకి వెళ్లినారు మంత్రి జూపల్లి. బయట నుంచి సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రదేశానికి 13.5 కి.మీ దూరం ఉంది. టన్నెల్లో భారీగా బురద ఉండటం, శిథిలాలు ఉండటంతో రెస్క్యూ టీం అతి కష్టం మీద ముందుకు సాగుతుంది. సొరంగంలో మూడున్నర మీటర్ల మేరా బురద పేరుకుపోయి ఉంది.
ఇది కూడా చూడండి: Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
సహాయక బృందాలు ట్యూబ్లు, థర్మకోల్ షీట్లు, వెదురు కర్రల సహాయంతో సొరంగంలోపలికి ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగి ఇప్పటికే 24 గంటలు అవుతుండటంతో బాధితుల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. టన్నెల్ లో ఉన్న నీటిని బయటకు పంపించేందుకు కనీసం 4 గంటల సమయం పడుతుందని మంత్రులకు సమాధానం ఇచ్చారు ఏజెన్సీ ప్రతినిధులు.
ఇది కూడా చూడండి: పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!
2025 ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 8-9 గంటల మధ్య టన్నెల్లో మట్టి కూలడం మొదలైంది. వెంటనే కొంతమంది బయటికి వచ్చినా ఎనిమిది మంది మాత్రం అక్కడే చిక్కుకున్నారు. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన ఉన్న సొరంగంలో కార్మికులు చిక్కుకుపోవడంతో వారికి ఆక్సిజన్ అందుతుందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. సహాయక చర్యలపై నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిలో మనోజ్, శ్రీను, సందీప్,జట్కాస్, అనుసాహు, సంతోష్, సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్ ఉన్నారు.