Drowning: తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరా మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు తీరంలోని సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరా మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు తీరంలోని సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు.
ఉత్తరకాశీ జిల్లా ధరాళి గ్రామంలో చోటుచేసుకున్న వరదల్లో కేరళకు చెందిన 28 మంది పర్యాటకులు గల్లంతైయ్యారు. గంగోత్రికి వెళ్లే మార్గంలో ధరాళి గ్రామం ఉంది. మంగళవారం మధ్యాహ్నం క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి గ్రామాన్ని ముంచెత్తింది.
ఆఫ్రికా నుంచి ఉపాది కోసం గల్ఫ్ దేశాలకు వస్తున్న శరణార్థులు, వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ యెమెన్ తీరంలో మునిగిపోయింది. ఈ ఘోర విషాద ఘటనలో 68 మంది మరణించగా, మరో 74 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ (IOM) వెల్లడించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బిహార్ వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన మైనర్ బాలిక.. వాటర్ బాటిల్ కొనుగోలు కోసం బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. పది మంది శుక్రవారం సాయంత్రం నదిలో స్నానానికి వెళ్తే అందులో ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
ఇరాన్ లో కిడ్నాప్ అయిన ముగ్గురు యువకులు క్షేమంగా ఉన్నారని అక్కడి ఎంబసీ తెలిపింది. దుండుగుల చెరలో ఉన్న వారిని ఇరాన్ పోలీసులు కాపాడి బయటకు తీసుకువచ్చారని చెప్పింది. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఇరాన్ లో ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారు. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందని అంటున్నారు.
కొత్తగా పెళ్లయిన ఒక జంట హనీమూన్ కోసం వెళ్లి దట్టమైన అడవుల్లో అదృశ్యమైంది. నవ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. జంట ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో ఒక కుటుంబం అదృశ్యమైంది. అప్పులు ఎక్కువవడం, వడ్డీలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారు ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా అదృశ్యమైన వారిలో భార్యాభర్తలు బాలకిషన్, వరలక్ష్మి, పిల్లలు శ్రవణ్ కుమార్, కావ్య, శిరీష ఉన్నారు.