Donald Trump: ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తాం.. మరో బాంబు పేల్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారంలోగా ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే మళ్లీ బాంబులు వేస్తామంటూ హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారంలోగా ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే మళ్లీ బాంబులు వేస్తామంటూ హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్కు మళ్లీ కోపం తెప్పించింది. హర్మూజ్ను తెరిచినప్పటికీ ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం ఉంటుందని ట్రంప్ తెలిపారు. అయితే ఈ దిగ్బంధనం కొనసాగితే మళ్లీ హర్మూజ్ను మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నెవాడా, అరిజోనా రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతుండగా, ఆయన వెంటే ఒక మహిళ పెద్ద ఎర్రటి బ్యాగును పట్టుకుని లోపలికి వెళ్లడం వీడియోలో కనిపించింది
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ప్రధాని మోదీని తన "మంచి స్నేహితుడు" అని సంబోధిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు.
అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, ఒక ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఇస్లామాబాద్లో ఒప్పందంపై సంతకాలు జరిగితే, నేను తప్పకుండా అక్కడికి వెళ్తానని ట్రంప్ పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక విజయం సాధించారు. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరు పక్షాలు అంగీకరించాయని ఆయన ప్రకటించారు.
హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక మూలాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక స్పష్టం చేస్తోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇరాన్తో యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని హింట్ ఇచ్చాడు. నవంబర్లో చమురు ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.