Team India: ఈ ఏడాది టీమ్ ఇండియా షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ తర్వాత ఈ ఏడాది టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ ల షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. దీని ప్రకారం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు , నవంబర్‌ - డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో తలపడనుంది. ఇవన్నీ స్వదేశంలోనే జరగనున్నాయి. 

New Update
bcci

bcci Photograph: (bcci )

ఈ ఏడాది భారత్ లోనే ఎక్కువ మ్యాచ్ లు ఆడనుంది టీమ్ ఇండియా క్రికెట్ జట్టు. విదేశీ జట్లే ఇక్కడకు రానున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో బిజీగా ఉన్న ఆటగాళ్ళు...దీని తర్వాత కొంత విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తరువాత నుంచి ఈ ఏడాదంతా వరుసగా సీరీస్ లు ఆడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఏడాది చివరి వరకూ ఇక్కడే స్వదేశంలోనే సీరీస్ లు ఆడనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు , నవంబర్‌ - డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో తలపడనుంది. ఇందులో ఒక మ్యాచ్ విశాఖలో కూడా జరగనుంది. దక్షిణాఫ్రికాతో భారత జట్టు ఒక వన్డే మ్యాచ్ వైజాగ్ లో ఆడనుంది. 2003 తర్వాత భారత జట్టు మళ్ళీ ఇక్కడ మ్యాచ్ ఆడుతోంది. 

Also Read :  తెలంగాణకు గుడ్ న్యూస్...మరో ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ 

తొలి టెస్టు - అక్టోబర్ 2 - 6 (అహ్మదాబాద్‌) 
రెండో టెస్టు - అక్టోబర్ 10 - 14 (కోల్‌కతా)

సౌతాఫ్రికాతో సిరీస్‌ల వివరాలు 

తొలి టెస్టు - నవంబర్ 14-18 (దిల్లీ)
రెండో టెస్టు - నవంబర్ 22-26 (గువాహటి)

Also Read :  హైదరాబాద్‌లోనే ప్రవీణ్‌ను చంపేశారు.. కేఏ పాల్ సంచలన వీడియో!

వన్డే వివరాలు..

తొలి వన్డే - నవంబర్ 30 (రాంచీ)
రెండో వన్డే - డిసెంబర్ 3 (రాయ్‌పూర్)
మూడో వన్డే - డిసెంబర్ 6 (విశాఖపట్నం) 

Also Read :  ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అప్పటి నుంచే వేసవి సెలవులు

టీ 20..

తొలి టీ20 - డిసెంబరు 9 (కటక్‌)
రెండో టీ20 - డిసెంబరు 11 (ఛండీగడ్)
మూడో టీ20 - డిసెంబరు 14 (ధర్మశాల)
నాలుగో టీ20 - డిసెంబరు 17 (లఖ్‌నవూ)
ఐదో టీ20 - డిసెంబరు 19 (అహ్మదాబాద్)

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 30న ఏం కొనాలి? ఏం కొనొద్దు?.. ఇలా చేస్తే మీరే కోటీశ్వరులు!

 

schedule | team-india | bcci | today-latest-news-in-telugu | today-news-in-telugu | telugu-cricket-news | telugu-sports-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment