Champions Trophy: మెగా సమరానికి సై..నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ...

అన్నీ పెద్ద జట్లే..ఒక్కటీ బోర్ కొట్టే మ్యాచ్ ఉండదు. ఏ ఒక్క టీమ్ నీ తక్కువగా అంచనా వేయలేము. 19 రోజులు...15 మ్యాచ్ లు...విజేతగా నిలిచేది ఎవరో...రసవత్తరమైన ఛాంపియన్స్ ట్రోఫీకి తెర లేచేది నేడే...

New Update
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ షెడ్యూల్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే.. 

ఒకదానిని మించి మరొకటిగా ఉండబోయే మ్యాచ్ లతో..అంచనాలను తారు మారు చేసే ఫలితాలతో నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) మొదలవనుంది. ప్రపంచ టాప్ 8 వన్డే జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది చివరిసారిగా 2017లో జరిగింది. ఆ తర్వాత రద్దయిన ఈ టోర్నీ ఇప్పుడు మళ్ళీ మొదలవనుంది. దీనికి పాకిస్తాన్ ఆతిధ్యం ఇస్తోంది. అయితే భారత్ ఆడే మ్యాచ్ లు అన్నీ మాత్రం దుబాయ్ లో జరగనున్నాయి. మొత్తం ఎనిమిది జట్లలో టీమ్ ఇండియా ఫస్ట్ ఫేవరెట్ అని అనడంలో కూడా ఎలాంటి సందోహం లేదు. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న భారత జట్టు కూడా ఈ టోఫ్రీని ఎలా అయినా గెలవాలని అనుకుంటోంది. వన్డే వరల్డ్ కప్ చివరి నిమిషంలో పోగొట్టుకున్న టీమ్ ఇండియా ఇదైనా గెలిచి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటోంది. 

Also Read :  దిగొచ్చిన బీసీసీఐ.. ఆటగాళ్లు ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!

ఈరోజు పాక్ లో మొదటి మ్యాచ్...

ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ లో ఆతిథ్య జట్టుతో న్యూజిలాండ్ తలపడనుంది. ఇక రేపు బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా (Team India) తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది.  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ టోర్నీలో తలపడుతున్న మిగతా జట్లు. వెస్టిండీస్, శ్రీలంక టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి. ఈ టోర్నీలో ఆడుతున్న జట్టు అన్నీ బలంగానే ఉన్నాయి. ఆప్ఘనిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. 

Also Read :  బుద్దిమార్చుకోని పాక్.. భారత్ను అవమానించేలా చిల్లర చేష్టలు!

ఇక ఈ టోర్నీని పాకిస్తాన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆతిథ్యంలోనూ , జట్టు ప్రదర్శన పరంగా కూడా నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. 2008లో శ్రీలంక పై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎవరూ పాకిస్తాన్ లో ఆడేందుకు సాహసించలేదు. పెద్ద జట్లు ఆ దేశ పర్యటనకు రావడానికి చాలా సమయమే పట్టింది. చాలాసార్లు పాక్ బోర్డు తమ దేశంలో మ్యాచ్ లు ఆడించాలని ప్రయత్నించిన సఫలం కాలేకపోయింది. ఇప్పుడు కూడా మిగతా దేశాలన్నీ పాకిస్తాన్ వెళ్ళడానికి ముందుకు వచ్చినా భారత్ మాత్రం ససేమిరా అంది. అందుకే భారత్ ఆడే మ్యాచ్ లు అన్నింటినీ దుబాయ్ లో నిర్వహించాలని డిసైడ్ చేశారు. అందులో కూడా చాలా విమర్శలు ఫేస్ చేసింది పీసీబీ. ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రకు గాయం అవడానికి కారణం ఫ్లడ్ లైట్లు సరిగ్గా లేకపోవడమే అని విమర్శలు వచ్చాయి. అయితే ఆ వ్యవహారం పెద్ద వివాదంగా మారకుండా ఐసీసీ, పీసీబీ చూసుకున్నాయి. దీంతో టోర్నీ నిర్వహణ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 

Also Read :  చూసి రెండేళ్లు...మాట్లాడి ఏడాది..కుమారుడ్ని తలచుకుని ఎమోషనల్ అవుతున్న ధావన్‌!

ఇక టోర్నీలో టీమ్ ఇండియా సెమీస్ కు చేరితే రెండు సెమీ ఫైనల్స్ మ్యాచ్ లు జరుగుతాయి. టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుంది. మరొక దానికి పాకిస్తాన్ ఆతిధ్యమిస్తుంది. అలాగే భారత జట్టు ఫైనల్స్ కు చేరితే తుదిపోరు దుబాయ్ లోనే ఉంటుంది. పాకిస్తాన్ ఫైన్లస్ కు చేరినా కూడా అక్కడే ఆడాలి. ఒకవేళ టీమ్ ఇండియా ఫైనల్ కు చేరకపోతేనే ఫైనల్స్ పాకిస్తాన్ లో జరుగుతుంది. 

Also Read: Cricket: నేనప్పుడే వెళ్ళను..రిటైర్మెంట్ పై రోహిత్ క్లారిటీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: డ్రెస్ మార్చింది.. విజయం కొట్టింది- RCB ఖాతాలో మరో గెలుపు

బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

New Update
RCB VS RR

RCB VS RR Photograph: (RCB VS RR)

బెంగళూరు ఖాతాలో మరో విజయం పడింది. ఇవాళ రాజస్తాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను అలవోకగా ఛేదించింది. ఎలాంటి ఉరుములు లేవు.. ఎలాంటి మెరుపులు లేవు.. కానీ తుఫాన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టు నిర్దేశించిన 174 లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ నష్టపోయి గెలుపొందింది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

టాస్ గెలిచి బౌలింగ్

మొదట టాస్‌ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్‌, జైస్వాల్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. వరుస పరుగులు రాబట్టారు. ఇలా 5 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 36 పరుగులు సాధించారు. సరిగ్గా అప్పుడే ఆర్ఆర్‌కు షాక్ తగిలింది. సంజు శాంసన్‌ (15) ఔట్‌ అయ్యాడు. ఇలా 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అలా వరుసగా వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్ జట్టు. రియాన్‌ పరాగ్‌ (30), జైస్వాల్‌ (75), హెట్‌మయర్‌ (9), ధ్రువ్‌ జురెల్‌ (35*), నితీశ్‌ రాణా (4*) పరుగులు సాధించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ఆర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ జట్టు చాలా సహనంతో ఆడింది. క్రీజులోకి వచ్చిన ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లీ నెమ్మదిగా పరుగులు రాబట్టారు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఇద్దరూ సగానికి పైగా పరుగులు చేశారు. అంతేకాకుండా చెరో హాఫ్ సెంచరీతో మెరిసారు. అయితే ఆర్ఆర్ జట్టు వరుస క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో విజయం బెంగళూరు సొంతం అయిందనే చెప్పాలి. ఫిల్‌సాల్ట్‌ (65) ఔట్‌ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్కోర్ భారీగా ఉంది. 10 ఓవర్లకు స్కోర్‌ 101/1గా ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఆ ఒక్క వికెట్ కోల్పోయి బెంగళూరు జట్టు విజయం సాధించింది. విరాట్‌కోహ్లీ 62*, దేవ్‌దత్‌ పడిక్కల్‌ 40* రాణించారు. 17.3 ఓవర్లలో 175 పరుగులు చేసింది ఆర్సీబీ.

Advertisment
Advertisment
Advertisment