BCCI: నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించండి: తండ్రి విజ్ఞప్తి!

ఆస్ట్రేలియాలో అదరగొడుతున్న నితీష్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు మాజీ ఛీప్ సెలెక్టర్ MSK ప్రసాద్‌. అండర్-14 అకాడమీలో నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించాలని తన తండ్రి అడిగాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కుర్రాడిని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. 

author-image
By srinivas
New Update
nitish kumar

nitish kumar Photograph: (nitish kumar)

BCCI: ఆస్ట్రేలియాపై బాక్సింగ్ డే టెస్టులో తన తొలి అంతర్జాతీయ సెంచరీని సాధించిన నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ 21 ఏళ్ల తెలుగు కుర్రాడు కష్టా్ల్లో ఉన్న భారత్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించి ఔరా అనిపించాడు. వరల్డ్ వైడ్ క్రికెట్ లవర్స్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా నితీష్ కుమార్ గురించి బీసీసీఐ మాజీ ఛీప్ సెలక్టర్ MSK ప్రసాద్‌ ఆసక్తికర విషయం బయటపెట్టారు. పదేళ్ల క్రితం నితీష్ ఆటతీరును చూసి ఫిదా అయ్యానని, ఇవాళ చేసిన సెంచరీ తన జీవితంలో మరిచిపోలేనంటూ ఆకాశానికెత్తేశాడు. అంతేకాదు తన తండ్రి నితీష్ కు ఉచిత భోజనం, బట్టలు, వసతి కల్పించాలంటూ తమను వేడుకున్న రోజులను గుర్తు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. 

10 సంవత్సరాల క్రితం..

అయితే నితీష్ ప్రతిభ వెనక కన్నీటి కష్టాలున్నాయని చెప్పాడు ఎంఎస్ కే ప్రసాద్.. '10 సంవత్సరాల క్రితం నేను ఆంధ్రా క్రికెట్‌కు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 2013-14లో రెసిడెన్షియల్ అకాడమీలను ప్రారంభించాం. అందులో నితీష్ ఆటతీరు చూసి అండర్-14 అకాడమీకి ఎంపికచేశాం. ఆ సమయంలోనే నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి నా దగ్గరకు వచ్చి.. తన జీవితంలో క్లిష్టమైన సమయాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు. తనకు ఖర్చుపెట్టే స్తోమత లేదన్నాడు. ఉచిత భోజనం, బట్టలు, వసతి కల్పించాలని రిక్వెస్ట్ చేశాడు. అంతేకాదు తన కొడుకు గొప్పగా ఆడగలడని నమ్మకంగా చెప్పాడు. అతనికి నేను కొన్ని బంతులు విసిరి చూశాను. బ్యాటింగ్ శైలినచ్చి ఆ పిల్లవాడిని అండర్-14 అకాడెమీలో కొనసాగించాం. 21 నాటికి అతను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాదు ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించడం మనం ఇప్పుడు చూస్తున్నాం. భవిష్యత్తులోనూ రాణించగలడు. నాకు చాలా గర్వంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. 

నా దగ్గర మాటలు లేవు..

ఈ మేరకు 'నా ఆనందాన్ని వ్యక్తపరచడానికి నా దగ్గర మాటలు లేవు. నలుగురు నాణ్యమైన బౌలర్లపై టెస్టు సెంచరీ సాధించడం నమ్మశక్యం కాదు. అతను ఎలివేట్ చేసిన తీరు అద్భుతం. ఈ సిరీస్‌లోకి రాకముందు అతను కొన్ని ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. కానీ అతని గత గణాంకాలతో పోలిస్తే పనితీరును చాలా మెరుగుపరుచుకున్నాడు. అతను ఈ సందర్భానికి తగ్గట్టుగా అడుగులు వేశాడని నేను అనుకుంటున్నాను. చాలా మంది ఆటగాళ్ళు దేశవాళీ క్రికెట్‌లో చాలా బాగా రాణించారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోయారు. కానీ నితీష్‌ అదరగొడుతున్నాడు'అంటూ పొగిడేశాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC vs RR : అదరగొట్టిన ఢిల్లీ .. రాజస్థాన్ టార్గెట్ 189

ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది, ఓపెనర్ అభిషేక్ పొరెల్ (49)టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (38) పరుగులతొ రాణించారు.

New Update
dc-vs-rr match

dc-vs-rr match

ఐపీఎల్ 2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు జేక్ ఫ్రేజర్  (9), అభిషేక్ పొరెల్(49)  మంచి శుభారంభాన్ని అందించారు. అభిషేక్ పొరెల్ దూకుడుగా జట్టు స్కోరు బోర్డును పెంచాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో 23 పరుగులు రాబట్టాడు. వరుసగా 4, 4, 6, 4, 4 బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  

 ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్‌

34 పరుగుల వద్ద  ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన 2.3 ఓవర్‌కు జేక్ ఫ్రేజర్ ఔట్  అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కరుణ్‌ నాయర్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన  కేఎల్ రాహుల్(38) తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు పొరెల్. అయితే 97 పరుగుల వద్ద  కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ఆ  కాసేపటికే అభిషేక్ పొరెల్ కూడా ఔటయ్యాడు. దీంతో 106 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 

అనంతరం స్టబ్స్ (34), అక్షర్ (34) ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచారు.  హసరంగ వేసిన 16 ఓవర్లో అక్షర్ పటేల్ తొలి మూడు బంతులకు వరుసగా 4, 4, 6 బాదేశాడు. ఈ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. ఇద్దరు 19 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించగా వీరి జోడీని తీక్షణ విడదీశాడు. చివర్లో స్టబ్స్, అశుతోష్ శర్మ(11) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ జట్టు 188 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, మహీశ్‌ తీక్షణ, వానిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Advertisment
Advertisment
Advertisment