BCCI:నితీశ్ రెడ్డికి పేరెంట్స్ సర్‌‌ప్రైజ్..వీడియో షేర్ చేసిన బీసీసీఐ

బాక్సింగ్ డే టెస్ట్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సెంచరీ చేశాడు. ఈ అద్భుత సెంచురీకి బీసీసీఐ అతనికి పెద్ద సర్‌‌ప్రైజ్ ఇచ్చింది. అతని తల్లిదండ్రులను ఆస్ట్రేలియా తీసుకువచ్చి నితీశ్‌ను సంతోషంలో మునిగిపోయేలా చేసింది.

New Update
parents

Nithish parents surprise

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోన్న నాలుగో (బాక్సింగ్ డే) టెస్ట్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తనదైన శైలిలో అదరగొట్టాడు. ఈ టెస్టులో టీమిండియా జట్టును ఫాలో ఆన్‌ నుంచి తప్పించి ఆపద్భాంధవుడయ్యాడు. అనంతరం అంతర్జాతయ టెస్టుల్లో తొలి సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. తను ఆడుతున్న మొదటి టెస్ట్‌లోనే సెంచరీ సాధించి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి నిలిచాడు.

ఎమోషనల్ వీడియో..

దీంతో నితీశ్ మీద సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అందరూ అతనికి రివార్డులు కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా నితీశ్ కి ఒ సర్‌‌ప్రైజ్ ఇచ్చింది. మూడో రోజు ఆట ముగిసిన హోటల్‌ రూమ్‌ కు వెళ్ళ సమయానికి అతని తల్లిదండ్రులను అక్కడికి పంపించింది. సడెన్‌గా పేరెంట్స్‌ను చూసిన నితీశ్ భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే వారిని హగ్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా ఎమోషనల్ అయిపోయారు. వీరందరితో పాటూ రితీశ్ సోదరి కూడా అక్కడే ఉంది. 

నితీశ్.. తన తల్లిని కౌగిలించుకుని.. ఆట ఎంజాయ్ చేశావా.. అని అడిగాడు. ఆ తర్వాత తన తండ్రిని కూడా అతను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ సమయంలో నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి.. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుకున్నారు. ఈరోజు నితీశ్‌ చాలా బాగా ఆడాడు. ఒక తండ్రిగా చాలా గ‌ర్వంగా ఉంది. చిన్న‌ప్ప‌టి నుంచి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. భారత జట్టు త‌ర‌పున సత్తా చాటాలనే అతడి కళ ఈరోజు నెరవేరింది. ఇదే సమయంలో మాట్లాడిన నితీశ్ సోదరి తేజస్వీ.. నా అన్న చెప్పాడు.. చేసి చూపించాడు.. అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌న అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్‌ చేసింది.

Also Read: Bengaluru: కండోమ్స్‌ సేల్స్‌లో బెంగళూరు టాప్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు.

New Update
KKR Vs PBKS sports

KKR Vs PBKS sports

కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 202 టార్గెట్ ఉంది. బ్యాటింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ 83, ప్రియాంశ్‌ ఆర్య 69 రాణించారు. శ్రేయస్‌ అయ్యర్‌ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి 1 వికెట్, రస్సెల్‌ 1 వికెట్‌ తీశారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ జట్టు మంచి ఆరంభం అందించింది. ప్రియాంశ్‌ ఆర్య, ప్రభు సిమ్రన్‌ సింగ్‌ ఓపెనర్లుగా వచ్చి అదరగొట్టేశారు. 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 54 పరుగులు చేశారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. ఇలా దూకుడుగా ఆడిన ప్రియాంశ్‌ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 90 పరుగులు చేశారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఆ తర్వాత రస్సెల్‌ బౌలింగ్‌లో ప్రియాంశ్‌ ఆర్య (69) ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రన్‌ సింగ్‌ దూకుడుగా ఆడాడు. అతడు కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (83) ఔట్‌ అయ్యాడు. అలా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (7), మార్కో యాన్సెన్‌ ఔట్, శ్రేయస్‌ అయ్యర్‌ 25* పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు రాబట్టారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

IPL 2025 | KKR VS PBKS | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment