/rtv/media/media_files/2025/04/13/VJvhl9Q2Bfjp2198RDtJ.jpg)
DC VS MI
ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్కు దిగిన 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్ శర్మ 3, దీపక్ చాహర్ 1, బుమ్రా 1, శాంట్నర్ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.
భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్ రోహిత్ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్, కుల్దీప్ రెండేసి వికెట్లు.. ముకేశ్ ఒక వికెట్ తీశారు.
today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians