రాజస్థాన్ రాయల్స్ కు మొదటి గెలుపు వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గువాహటిలో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిపోయిన ఆర్ఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ టీమ్ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి సీఎస్కేకు 184 లక్ష్యాన్ని ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన చెన్నై బ్యాటర్లకు మొదటి ఓవర్లోనే ఝలక్ తగిలింది. మూడో బంతికే సీఎస్కే తన మొదటి వికెట్ ను కోల్పోయింది. తరువాత కూడా చాలా తొందరగానే మరో రెండు వికెట్లు పడిపోయాయి. రచిన్ రవీంద్ర 0, రాహుల్ త్రిపాఠీ 23, శివమ్ దూబే 18, విజయ్ శంకర్ 9లు వరుసగా అవుట్ అయిపోయారు. కానీ చెన్నై కెప్టెన్ రుతురాజ్ మాత్రం పట్టుదలగా ఆడాడు. వికెట్లు పడిపోతున్నా అవతలి ఎండ్ లో నిలబడి బ్యాటింగ్ చేశాడు. 63పరుగులు చేసి టీమ్ గెలిపించడానికి కష్టపడ్డాడు. అసలు ఈరోజు మ్యాచ్ చివర వరకూ సాగింది. చివర వరకు ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమైంది. 19వ ఓవర్లో కూడా చెన్నై మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపించాయి. కానీ 19 ఓవర్లో సందీప్ బౌలింగ్ లో ధోని అవుట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఆర్ఆర్ సొంతమైంది. ఆర్ఆర్ టీమ్ లో ఈరోజు బ్యటార్లలో నితీశ్ రాణా హీరో అయితే బౌలర్లలో హసరంగ హీరో. నాలుగు వికెట్లు తీయడమే కాక చాలా ముఖ్యమైన బ్యాటర్లను అవుట్ చేశాడు. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ ఆరుపరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్..
గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 9వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నితీశ్ రాణా(81), రియాన్ పరాగ్ (37), సంజుశాంసన్ (20), హిట్ మయర్ (19) ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మొదటి బంతికే ఫోర్ బాది మంచి ఊపుమీద కనిపించిన ఓపెపర్ జైస్వాల్ (4) వెంటనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో రవిచంద్రన్ అశ్విన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాతో ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు సంజుశాంసన్. ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేశారు. ఈ క్రమంలోనే 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
రియాన్ పరాగ్ భారీ షాట్లతో..
మంచి ఊపుమీదున్న రాజస్థాన్ కు నూర్అహ్మద్ బిగ్ షాక్ ఇచ్చాడు. అతని బౌలింగ్ లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సంజు శాంసన్ (20) వెనుదిరిగాడు. దీంతో వీరి 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోపక్కా నితీశ్ రాణా మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో 81 పరుగుల వద్ద.. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చి ధోనీ స్టంపింగ్ కు దొరికిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు నితీశ్ రాణా. అనంతరం ధ్రువ్ జురేల్ (3), హసరంగ (4) వెనువెంటనే ఔట్ అయ్యారు. దీంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. చివర్లో రియాన్ పరాగ్ (37) భారీ షాట్లతో అలరించడంతో రాజస్థాన్ భారీ చేసింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీయగా.. మథీష పతిరానా మూడు వికెట్లు తీశారు.
today-latest-news-in-telugu | ipl-2025 | csk | match
Also Read:Mynmar Earth quake: శవాల దిబ్బగా మయన్మార్..వ్యాపిస్తున్న దుర్గంధం