Cricket: ఇంగ్లాండ్ తో నాలుగు టీ20..ఈరోజైనా కెప్టెన్ బ్యాటింగ్ చేస్తాడా

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సీరీస్ లో భాగంగా ఈరోజు పుణె లో నాలుగో టీ20 జరగనుంది. రెండు మ్యాచ్ లలో గెలిచిన టీమ్ ఇండియా మూడో మ్యాచ్లో ఓడిపోయింది. దాంతో ఇవాల్టి మ్యాచ్ కీలకంగా మారింది.

New Update
sports

India Vs England Fourth T20

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలో టీమ్ ఇండియా విజృంభించేసింది. బ్యాటింగ్, బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కానీ మూడో మ్యాచ్ లో మాత్రం కెప్టెన్ సూర్య జట్టు మాత్రం చతికిలపడిపోయింది. వరుణ్ కుమార్ 5 వికెట్లు తీసి బౌలింగ్ తో అదరగొట్టినా...బ్యాటింగ్ లో విఫలమవడంతో మ్యాచ్ ఓడిపోయింది. మరోవైపు మొదటి మ్యాచ్ గెలిచి ఇంగ్లాండ్ టీమ్ ఉత్సాహంగా ఉంది. మొదటి రెండు ఓడిపోయి డీలా పడిపోయిన జట్టుకు మూడో దానితో మళ్ళీ బలం చేకూరింది. సీరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సీరీస్ మనకు దక్కాలంటే సూర్యసేన ఈరోజు మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. అలాగే ఇంగ్లాండ్ కూడా ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. సీరీస్ చేతిలో ఉండాలంటే ఇది తప్పక గెలవాలి. 

Also Read: USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం

సమిష్టి రాణిస్తేనే విజయం..

టీ20 సీరీస్ లో మొదటి మ్యాచ్ లో అభిషేక్ వర్మ, రెండో దానిలో తిలక్ వర్మ బ్యాటింగ్ బాగా చేసి జట్టును ఆదుకున్నారు. వారిద్దరూ తప్ప ఇంకెవరూ గట్టిగా బ్యాటింగ్ చేయలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొత్తానికే ఫెయిల్ అయ్యాడు. మూడో మ్యాచ్ లో బ్యాటర్లు అందరూ సమిష్టిగా చేతులెత్తేశారు. ఇప్పుడు నాలుగో దానిలో కూడా ఇదే రిపీట్ అయితే కష్టమే. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ ఆడకపోతే జట్టు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. అలాగే సంజూ శాంసన్ కూడా ఆడాలి. ఈరోజు మ్యాచ్ లో ఇద్దరు లేదా ముగ్గురు బాగా బ్యాటింగ్ చేస్తేనే తప్ప గెలవలేము. ఇక బౌలింగ్ లో స్పిన్నర్లు బాగానే రాణిస్తున్నారు. ఏడాది తర్వాత వచ్చిన షమి పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రవి బిష్ణోయ్ అయితే పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో ఈరోజు మ్యాచ్ లో ఎవరెవరిని బరిలోకి దింపుతారు అన్నది ఆసక్తిగా మారింది. 

Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment