CSK VS DK: చెన్నైకి మరో లాస్‌.. బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌

చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 25 పరుగుల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.

author-image
By B Aravind
New Update
Delhi Capitals

Delhi Capitals

చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 25 పరుగుల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ వరుసగా మూడోసారి కూడా ఓడిపోయింది. 15 ఏళ్లకి తర్వాత చెపాక్‌ స్టేడియంలో ఢిల్లీ గెలవడం విశేషం. చివరిసారిగా 2010లో అక్కడ గెలిచింది.

Also read: గెలిచిన సంతోషమే లేదు కదరా.. రిషబ్ పంత్కు బిగ్ షాక్!

184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK.. 5 వికెట్లు కోల్పోయి కేవలం 158 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ 69తో స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది.ధోని 30, దూబే 18 పరుగులు చేశారు. జడేజా 2, విప్రాజ్‌ 2 పరుగులతో నిరాశపర్చారు. ముకేశ్‌, కుల్దీప్‌లు తలో వికెట్ తీశారు. తొలుత టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ డకౌట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ పొరెల్‌ వరుసగా 4,6,4,4 బాదాడు. ఆ తర్వాత అభిషేక్‌ని జడేజా తన తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు. అక్షర్ పటేల్ 21 పరుగులు చేసి నూర్ అహ్మద్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయిపోయాడు.

Also Read: తిలక్ వర్మకు ఘోర అవమానం..  హార్దిక్‌ ఇది నీకు న్యాయమేనా?

 12 ఓవర్లకు స్కోరు 100 దాటింది. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. ఫామ్‌లో ఉండి బాల్‌ను బౌండరీలకు పంపించారు. రిజ్వీని 17వ ఓవర్‌లో ఖలీల్‌ ఔట్ చేశారు. పతిరన వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో రాహుల్‌ ధోనికి క్యాచ్ ఇచ్చాడు. ఇక అశుతోష్ శర్మ ఒక్క పరుగుతో రనౌట్ అయ్యాడు. మొత్తానికి స్కోర్ 183 పరుగులకు చేరుకుంది. బరిలోకి దిగిన సీఎస్‌కే లక్ష్యాన్ని ఛేదించలేక వరుసగా మూడోసారి కూడా ఓడిపోయింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Virat kohli: టీ20ల్లో ఏకైక మొనగాడు.. కింగ్ ఖాతాలో మరో రికార్డ్!

భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. టీ20ల్లో13 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 386 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీకంటే ముందు నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు.

New Update
v kohli

Virat Kohli new record in IPL most runs

Virat kohli:  భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. టీ20ల్లో13 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 386 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీకంటే ముందు నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు. 

42 బంతుల్లో 67 పరుగులు..

ఈ మేరకు IPL 18 సీజన్‌లో భాగంగా ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మైలు రాయి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 67 పరుగులు చేశారు. 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. 

టీ 20ల్లో టాప్ -5 బ్యాటర్లు:
14562 - క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్‌లు)
13610 - అలెక్స్ హేల్స్ (474 ఇన్నింగ్స్‌లు)
13557 - షోయబ్ మాలిక్ (487 ఇన్నింగ్స్‌లు)
13537 - కీరన్ పొలార్డ్ (594 ఇన్నింగ్స్‌లు)
13050 - విరాట్ కోహ్లీ (386 ఇన్నింగ్స్‌లు)

Also Read: రేపు ఇందిరా పార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....

ఇదిలా ఉంటే.. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేశారు. విరాట్‌ కొహ్లీ 67 పరుగులతో మెరిపించాడు. కెప్టెన్ పాటిదర్ 64, పడిక్కల్ 37, జితేశ్ శర్మ 40 పరుగులతో చెలరేగారు. ఇక హార్దిక్ పాండ్య, బౌల్డ్‌ చెరో 2 వికెట్లు తీశారు. విఘ్నేష్ ఒక వికెట్ పడగొట్టాడు. ముంబయి ఇండియన్స్ గెలవాలంటే 222 పరుగులు చేయాలి. 

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 virat-kohli | IPL 2025 | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment