IPL 2025: మీ భార్యల వల్లే ఇలా తయారయ్యారు.. ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్స్

టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త నిబంధనలతో ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమైంది. భార్యాపిల్లలతో స్టేయింగ్‌ను చిన్న టోర్నీలప్పుడు ఏడు రోజులు అలాగే పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు తగ్గించింది.

New Update
IPL 2025

IPL 2025 Photograph: (IPL 2025)

IPL 2025: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడంతో ఆటగాళ్లపై బీసీసీఐ(BCCI) గుర్రుగా ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త నిబంధనలతో ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు పెట్టేందుకు బీసీసీఐ సిద్ధమైంది.   2019కి ముందు అమలులో ఉన్న నిబంధనలను మళ్లీ అమలు చేయాలని బోర్డు పరిశీలిస్తోంది. జట్టులో VVIP కల్చర్‌ను తగ్గించేందుకు ఇకపై అందరూ టీమ్‌ బస్సులోనే ప్రయాణించాలని బీసీసీఐ ఆదేశించింది.

Also Read: Russia: రష్యాలో మరో భారతీయుడు మృతి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి తరువాత బీసీసీఐ 2025 జనవరి 11న ముంబైలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) లు హాజరయ్యారు.  ఈ సమీక్షలో మార్గదర్శకాలను సూచించింది. 

Also Read: Cricket: కెప్టెన్సీ రేసులో జైశ్వాల్...కోచ్ గంభీర్ మద్దతు

పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులు

భార్యాపిల్లలతో స్టేయింగ్‌ను చిన్న టోర్నీలప్పుడు ఏడు రోజులు అలాగే  పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు తగ్గించింది. ఈ రూల్ వల్ల మొత్తం టోర్నమెంట్‌లో ఆటగాళ్ల తమ భార్యలతో ఉండలేరు.  ముఖ్యంగా విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్ల ప్రదర్శనను కుటుంబ సభ్యులు ప్రభావితం చేస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.  బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొత్తంలో చాలా మంది క్రికెటర్ల భార్యలు ఆస్ట్రేలియాలో ఉన్నారు.  

Also Read: Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు

అంతేకాకుండా ఆటగాళ్ల బ్యాగేజ్ 150 కేజీల కన్నా ఎక్కువ ఉండకూడదని బీసీసీఐ కండిషన్ పెట్టింది. ఒకవేళ  ఉంటే ఆటగాళ్లు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక హెడ్ కోచ్  గౌతమ్ గంభీర్, అతని  పర్సనల్ మేనేజర్ వేరే బస్సులో ప్రయాణించాల్సి ఉంటుందని, వీఐపీ బాక్సులో కూర్చోవడానికి వీల్లేదంటూ బీసీసీఐ తేల్చింది. వీరు మరో హోటల్‌లో కూడా బస చేయాల్సి ఉంటుంది.  

కాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. త్వరలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్(IPL 2025 Schedule) ఇప్పటికే విడుదలైంది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్(India Vs Pakistan) జరగనుంది.ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడనుంది.  భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరగనుంది. భారత్ ఫైనల్ చేరితే ఫైనల్ కూడా దుబాయ్ లోనే జరుగుతుంది.

Also Read :  ఓ వైపు కార్చిచ్చు..మరో వైపు చుక్కలనంటుతున్న అద్దెలు..ఇంకో పక్క

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IPL 2025: ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

ఒకే ఒక్క మ్యాచ్..రాత్రికి రాత్రే ఆ కుర్రాడిని హీరోగా మార్చేసింది. అంతర్జాతీయ అనుభవం లేదు..దేశవాళీలోనూ పాతిక మ్యాచ్ లు కూడా ఆడలేదు. కానీ ఐపీఎల్ లో నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ బాదేసి..హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రియాంశ్ ఆర్య. ఎవరీ కుర్రాడు?

New Update
ipl

Priyansh Arya

నిన్న ముల్లాపూర్ లో సొంత మైదానంలో చెన్నైతో తలపడింది పంజాబ్ కింగ్స్. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎనిమిది ఒవర్లలోనే ఐదు వికెట్లు పడిపోయాయి. కానీ ఒక కుర్రాడు మాత్రం ఫీల్డ్ ను అతుక్కుని ఉండిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు చెక్కుచెదరకుండా ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కే బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఆ కుర్రాడే ప్రియాంశ్ ఆర్య. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్ లతో 103 పరుగులు చేసి పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యంత ప్రమాదకరమైన పతిరన బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టి వారెవ్వా అనిపించాడు. 

ఢిల్లీ కుర్రాడు..
 

24 ఏళ్ళ ప్రియాంశ్ ఆర్య ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. దేశావాళీల్లో కూడా పాతిక మించి ఆడి ఉండడు. కానీ ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు.  ఉత్తరప్రదేశ్ లో పుట్టిన ప్రియాంశ్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. దేశవాళీలో కూడా ఢిల్లీ తరుఫునే ఆడాడు. 2021/22 సీజన్‌లో అరంగేట్రం చేసిన ప్రియాంశ్‌ కేవలం 7 లిస్ట్‌ - A మ్యాచులు ఆడాడు. అతడు చేసిన పరుగులు 77 మాత్రమే. దేశవాళీల్లో టీ 20ల్లో 22 మ్యాచుల్లో 731 పరుగులు చేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో నార్త్‌ దిల్లీ స్ట్రైకర్‌పై 50 బంతుల్లోనే 120 పరుగులు చేసిన ఆర్య ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ పై 102 పరుగులతో చితక్కొట్టాడు. వీటితో వెలుగులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ఇతనిని రూ.3.80 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. 

ఐపీఎల్ లో ..

ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ నాలుగు  మ్యాచ్ లు ఆడింది.  మొదటి మ్యాచ్ లో గుజరాత్ పై 22 బంతుల్లో 47 పరుగులు చేసి తానమేంటో మరోసారి నిరూపించుకున్నాడు. భారీ మొత్తాన్ని వెచ్చించి ఎందుకు కొనక్కున్నారో చేసి చూపించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో 8, 0 పరుగులతో తేలిపోయాడు. కానీ నిన్న ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజృంభించేశాడు. ఐపీఎల్‌లో నాలుగో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | punjab-kings 

Also Read: Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..

Advertisment
Advertisment
Advertisment