Amit Shah- Olympics 2036: భారత్‌లోనే 2036 ఒలింపిక్స్‌.. బడ్జెట్‌ కేటాయింపుపై అమిత్ షా కీలక ప్రకటన!

భారతీయ క్రీడా అభిమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఇండియా సిద్ధంగా ఉందని అమిత్‌ షా తెలిపారు. ప్రస్తుతం మన క్రీడల బడ్జెట్‌ రూ.3800 కోట్లకు చేరుకుందని చెప్పారు. 

New Update
Olympics 2036

Olympics 2036 Photograph: (Olympics 2036)

Amit Shah- Olympics 2036: భారతీయ క్రీడా అభిమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఇండియా(India to host 2036 Olympics) సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అమిత్‌ షా(Amit Shah) తెలిపారు. క్రీడల్లో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. 2014లోమోదీ(PM Modi) ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రూ.800 కోట్లు మాత్రమే ఉన్న క్రీడల బడ్జెట్‌.. ఇప్పడు రూ.3800 కోట్లకు చేరుకుందని కొనియాడారు. క్రీడల పట్ల మోదీ ప్రభుత్వం చూపిప్తున్న చొరవ, అంకితభావానికి ఇదే నిదర్శనం అన్నారు.

ఇది కూడా చదవండి: Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

దేవ భూమి ‘ఖేల్‌ భూమి’గా..

ఈ మేరకు ఉత్తరాఖండ్ 38వ జాతీయ క్రీడల(/38th National Games Uttarakhand) ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా.. క్రీడాకారుల సత్తాతో ఉత్తరాఖండ్‌ దేవ భూమి ‘ఖేల్‌ భూమి’గా రూపాంతరం చెందిందన్నారు. గత క్రీడల్లో పతకాల పట్టికలో 21వ స్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్‌ ఈసారి 7వ ర్యాంకు సాధించడంపై ప్రశంసలు కురిపించారు.  ఈ సదర్భంగానే ఒలింపిక్స్‌ క్రీడలను నిర్వహించేందుకు భారత్ రెడీ ఉందన్నారు. భారతీయ క్రీడాకారులు పతకాలు సాధించేందుకు సన్నద్ధం కావాలని పిలపునిచ్చారు. ఇక ఈ పోటీలు ముగిసిన సందర్భంగా భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు PT ఉష.. మేఘాలయా సీఎం కాన్రాడ్‌ సంగ్మాకు క్రీడల పతాకాన్ని అందించారు. దీంతో తదుపరి జాతీయ క్రీడలు మేఘాలయాలో జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Nandamuri Balakrishna : అమరావతికి బాలయ్య గుడ్ న్యూస్ !

టాప్‌లో ఉన్న జట్లు..

ఈ జాతీయ క్రీడల్లో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డ్‌ 121 పతకాలను గెలిచి టాప్ లో నిలిచింది. 68 గోల్డ్ మెడల్స్, 26 సిల్వర్ మెడల్స్, 27 బ్రాంజ్ మెడల్స్ దక్కించుకుంది. మహారాష్ట్ర 198 పతకాలతో 2 స్థానంలో నిలిచింది. హర్యానా 153 పతకాలతో 3 స్థానం, కర్ణాటక, మధ్యప్రదేశ్ 4, 5వ స్థానాల్లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ 12 పతకాలను సాధించింది. 7 గోల్డ్,  ఒక రజతం, 6 కాంస్యాలను సాధించి 18వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 3 గోల్డ్ మెడల్స్, 3 రజత పతకాలు, 12 కాంస్య పతకాలతో 18 మెడల్స్ దక్కించుకని 26వ స్థానంలో నిలిచింది. 

ఇది కూడా చదవండి:  Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Virat Kohli Record: రాజస్థాన్‌తో మ్యాచ్.. కింగ్ కోహ్లీ ముందు భారీ రికార్డు- 3 సిక్సులు బాదితే

ఇవాళ చినస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ vs ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ముందు భారీ రికార్డు ఉంది. కోహ్లీ మరో మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు.

New Update
virat Kohli rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ 42వ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ముందు భారీ రికార్డు ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ రికార్డు అందుకునే ఛాన్స్ ఉంది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ ముందు భారీ రికార్డు

కోహ్లీ మరో మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నవాడవుతాడు. అవును.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ విషయం తెలిసి కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్సులు కొట్టి రికార్డును క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

టాస్ గెలిచిన ఆర్ఆర్

ఐపీఎల్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్  జరుగుతోంది.  ముందుగా టాస్ గెలిచిన జట్టు రాజస్థాన్  కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్  లో రాజస్థాన్  కీలక ఆటగాడు సంజూ ఆడటం లేదు. కాగా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 33 మ్యాచ్ లు జరగగా..  16 సార్లు ఆర్సీబీ గెలువగా..  14 సార్లు రాజస్థాన్ గెలిచింది. 

జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (సి), ధ్రువ్ జురెల్ (w), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

virat-kohli | IPL 2025 | virat-kohli-records | rcb-vs-rr | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment