/rtv/media/media_files/2026/04/23/elections-2026-04-23-08-29-56.jpg)
elections
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections 2026) ల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం తొలి విడత కింద 152 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తమిళనాడులో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కూటములతో పాటు ప్రముఖ సినీ నటుడు విజయ్(tvk vijay) స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. అయితే మొత్తం 4,023 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. - breaking-news
ఇది కూడా చూడండి: IRGC Attacks: హర్మూజ్ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్
VIDEO | Tamil Nadu Polls: Voting delayed at Booth 295 in Thoothukudi’s Duvipuram due to control unit malfunction.#AssemblyPollsWithPTI#TamilNaduPollsWithPTI
— Press Trust of India (@PTI_News) April 23, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/gsTbDDkWfN
ఇది కూడా చూడండి: BIG BREAKING: కాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పు.. సీఎం రేవంత్పై విరుచుకుపడ్డ కేటీఆర్
మొదటి విడతలో..
మరోవైపు పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తొలి విడతలో భాగంగా 152 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొంటున్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బెంగాల్లో ఎన్నికల హింసను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఈసారి పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Britain: మధ్య ఆసియాపై కన్నేసిన బ్రిటన్.. రష్యా, చైనాలకు పోటీగా బిగ్ ప్లాన్
#UPDATE : Polling Begins for 152 Seats in First Phase of Bengal Assembly Elections
— upuknews (@upuknews1) April 23, 2026
Polling for the first phase of the West Bengal Assembly elections began across 152 constituencies under heavy security, marking the start of a crucial electoral battle in the state. Voting started… pic.twitter.com/q8fPS0TuGR
ఇది కూడా చూడండి: కర్ణాటకలో దారుణం.. అమెరికా మహిళపై అత్యాచారం..
Follow Us