Prashanth Kishore: తమిళనాడులో విజయ్ పార్టీని గెలిపిస్తా.. ధోని కంటే ఫేమసవుతా : ప్రశాంత్ కిషోర్

ధోనీ చెన్నై టీమ్‌ను గెలిపించినట్లు తాను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. విజయ్‌ పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు.

New Update
Prashanth Kishore

Prashanth Kishore

ప్రముఖ మాజీ రాజకీయ వ్యూహకర్త, జన్‌సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిషోర్‌ (Prashanth Kishore) సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ చెన్నై టీమ్‌ను గెలిపించినట్లు తాను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. విజయ్‌ పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. తమిళనాడులోని మహబలిపురంలో టీవీకే మొదటి వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న పీకే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Also Read :  నెల పాటు అల్పాహారం తీసుకోకపోతే ఏమవుతుంది?

Prashanth Kishore About Tamil Nadu Politics

Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం

ఇదిలాఉండగా.. తమిళనాడులో గత అసెంబ్లీ డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిషోర్‌ వ్యూహకర్తగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త పనికి స్వస్థి పలికి సొంతగా జన్‌సూరజ్‌ పార్టీని స్థాపించారు. కానీ తనను స్వయంగా సంప్రదించే నేతలకు మాత్రం పీకే సలహాలు ఇస్తున్నారు. అయితే తాజాగా టీవీకే వార్షికోత్సవ వేడుకల్లో పీకే పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపిస్తానని చెప్పడం చర్చనీయమవుతోంది. అయితే ఐ ప్యాక్‌ సంస్థ ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్‌ చేతల్లో లేదు. దీంతో ఐ ప్యాక్‌ తరఫున కాకుండా వ్యక్తిగతంగానే పీకే విజయ్ పార్టీకి సపోర్ట్‌ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. 

Also Read: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

అయితే విజయ్‌ (Vijay) తన రాజకీయ పార్టీని ప్రకటించిన అనంతరం అన్నాడీఎంకేపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కేవలం డీఎంకే పార్టీనే టార్గెట్‌ చేశారు. అన్నా డీఎంకేతో పొత్తుకి సంబంధించి విజయ్‌ వ్యూహాత్మకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. జయలలిత అభిమానులు తనవైపు ఉండే టీవీకే విజయం సాధిస్తుందని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే మరింత బలం చేకూరుతుందనే ప్రచారం నడుస్తోంది.  

Also Read :  అంతు చిక్కని వ్యాధి.. ఈ వైరస్ సోకితే 48 గంటల్లో మరణమే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment