Viral News: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. పెళ్లైన రెండో రోజే వధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వరుడి ఫ్యామిలీ ఆమె బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను భార్యను అంగీకరించనంటూ వరుడు తేల్చి చెప్పేశాడు.  

New Update
marriage,

Uttar Pradesh Prayagraj new bride delivery case

Viral News: అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న యువకుడికి వధువు ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లైన రెండు రోజులకే ఆమె అత్తగారింట్లో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇంట్లో అడుగుపెట్టి శుభదినం ఇలాంటి ఘటన ఎదురుకావడతో ఒక్కసారిగా ఆ వరుడి కుటుంబం ఉలిక్కిపడింది. దీంతో తాము దారుణంగా మోసపోయానని గుండెలు బాదుకుంటూ వధువు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి. 

Also read: Breaking: విదేశాంగ మంత్రి జైశకర్ పై ఖలీస్థానీల దాడికి యత్నం

బంధువులందరికీ టీ, కాఫీలు ఇచ్చి..

ఈ మేరకు పోలీసులు, వరుడి బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 24వ యువ జంటకు ఘనంగా పెళ్లి జరిగింది. దీంతో పెళ్లైన రెండో రోజు నవ వధువు అత్తారింటికి వచ్చింది. ఫిబ్రవరి 26న ఉదయం భర్తతోపాటు అతని బంధువులందరికీ టీ, కాఫీలు ఇచ్చింది. మధ్యాహ్నం వంటకూడా చేసిన యువతి.. సాయంత్రం పూట కడుపులోనొప్పి అంటూ కన్నీరుపెట్టుకుంది. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే కాసేపటికే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయని, బిడ్డకు జన్మనిచ్చిందంటూ వైద్యులు తెలిపారు.  బిడ్డను తీసుకొచ్చి వారి చేతిలో పెట్టారు. 

ఈ వార్త వినగానే పిడుగుపడ్డట్లు ఉలిక్కిపడ్డారు. ఆ నవ వధువు, ఆమె బంధువులు తమను మోసం చేశారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెను తాను భార్యగా స్వీకరించట్లేదని వరుడు తేల్చి చెప్పేశాడు. పెళ్లి రోజు ఆమె పెద్ద లెహంగా ధరించినపుడే నాకు ఏదో తేడాగా అనిపించింది. కానీ లావుగా ఉందేమో అనుకుని పట్టించుకోలేదు. మొదటి  రాత్రి కూడా నాకు దూరంగానే పడుకుంది. కొత్తగా పెళ్లైందని నేను పట్టించుకోలేదు అంటూ వరుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వార్త వీడియో వైరల్ అవుతోంది. 

Also read: Trump Warning : హమాస్‌‌కు ట్రంప్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.. ‘వారి శవాలు మీకెందుకు’

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Marriage: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా, అల్లుడు.. 2.5 లక్షల నగదు, బంగారంతో జంప్ అయ్యారు. దీంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
Woman Elopes With To Be Son-in-Law Days Before Wedding

Woman Elopes With To Be Son-in-Law Days Before Wedding

ఉత్తరప్రదేశ్‌లో అందరూ నొరెళ్లబెట్టే సంఘటన చోటుచేసుకుంది. తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా అల్లుడు ఇద్దరూ జంప్ అయిపోయారు. అలాగే 2.5 లక్షల నగదు, బంగారం కూడా ఎత్తుకెళ్లారు. ఇరు కుటుంబాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. చివరికీ పారిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్ జిల్లాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కూతురికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. వరుడు దొరకడంతో పెళ్లి సంబంధం ఖాయమైపోయింది. ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే కాబోయే పెళ్లి కొడుకు తరచుగా తన అత్తవారింటికి వచ్చేవాడు. అయితే ఓసారి అతడు తనకు కాబోయే అత్తకు మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్లద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 

Also Read: ఓరి కామాంధుడ.. ఆవుని కూడా వదల్లేదు కదరా.. ఛీ ఛీ- వీడియో వైరల్

మరో 9 తొమ్మిది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్లొస్తామని చెప్పి అత్త, అల్లుడు పారిపోయారు. 2.5 లక్షల నగదు, బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. చివరికి ఆ పారిపోయిన మహిళ భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Also Read: ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు

telugu-news | rtv-news | national-news | uttar-pradesh

 

 

Advertisment
Advertisment
Advertisment